E-Paper
Advertisement

Phone Tapping Case: ఆరా మస్తాన్ స్టేట్మెంట్లు కీలకం.. రెండోసారి విచారిస్తున్న సిట్

Phone Tapping Case: ఆరా మస్తాన్ స్టేట్మెంట్లు కీలకం.. రెండోసారి విచారిస్తున్న సిట్
Advertisement

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో.. రాజకీయ కుట్రలపై ప్రత్యేక దృష్టి సారించిన సిట్ విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలే కీలకంగా మారనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్‌ను సిట్ అధికారులు మరోసారి విచారిస్తున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఆరా మస్తాన్‌ను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో ఒకసారి ఇప్పటికే విచారించి స్టేట్మెంట్ నమోదు చేసిన సిట్, ఇప్పుడు రెండవసారి ఆయనను సాక్షిగా విచారిస్తూ మరింత లోతైన సమాచారం సేకరిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వెనుక రాజకీయ ప్రయోజనాలు, లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులు ఎవరు, ఏ కాల్‌లు ట్యాప్ అయ్యాయి అనే అంశాలపై.. సిట్ ప్రధానంగా దృష్టి పెట్టింది.

Advertisement

సిట్ విచారణలో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో.. ఆరా మస్తాన్‌తో జరిగిన ఫోన్ సంభాషణలు ట్యాప్ అయినట్లు గుర్తించారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి‌తో ఆరా మస్తాన్ మాట్లాడిన కాల్స్ కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ అంశం కేసులో అత్యంత కీలక మలుపుగా మారింది.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విస్తృతంగా జరిగిందని సిట్ ఇప్పటికే నిర్ధారించింది. అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకుల ఫోన్లను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు విచారణలో తేలింది. హరీశ్ రావుతో పాటు ప్రతిపక్ష నేతలైన రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి తదితరుల ఫోన్ సంభాషణలు ట్యాపింగ్‌కు గురైనట్లు ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు.

Advertisement

ఆరా మస్తాన్ ఫోన్‌ను మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో.. అప్పటి ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అయితే ఆ అనుమానాలకు సరైన ఆధారాలున్నాయా? లేక రాజకీయ అవసరాల కోసమే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? అన్న అంశాలపై ఇప్పుడు సిట్ లోతుగా విచారిస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరా మస్తాన్ స్టేట్మెంట్‌ను సాక్షిగా రికార్డ్ చేయడం ద్వారా, అప్పటి రాజకీయ పరిణామాలపై స్పష్టత రావొచ్చని సిట్ భావిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్, రాజకీయ విశ్లేషణల నేపథ్యంలో ఆయనతో జరిగిన సంభాషణలు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నలు కీలకంగా మారాయి.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ ద్వారా అంచనా వేసిన వ్యక్తిగా ఆరా మస్తాన్ ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అభిప్రాయాలు, రాజకీయ నాయకులతో జరిగిన చర్చలు, వ్యూహాత్మక సమాచారం ఏ మేరకు ట్యాపింగ్‌కు గురయ్యాయన్న అంశాలపై సిట్ దృష్టి సారించింది.

Also Read: రాష్ట్రంలో యూరియా కొరత.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు మండిపాటు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, ఇతర అధికారుల పాత్రపై విచారణ కొనసాగుతోంది. సిట్ త్వరలోనే సుప్రీంకోర్టుకు సమగ్ర నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందులో ఆరా మస్తాన్ వంటి కీలక సాక్షుల స్టేట్మెంట్లు కీలక ఆధారాలుగా మారనున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×