E-Paper
Advertisement

PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు మీకు ఇంకా పడలేదా.. త్వరగా ఇలా చేయండి..?

PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు మీకు ఇంకా పడలేదా.. త్వరగా ఇలా చేయండి..?
Advertisement

PM Kisan: దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికి మార్చి 13 వ తారీకున అన్నదాతలకు తీపి కబురు అందింది. దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను విడుదల చేసింది. దీంతో దేశంలోని అన్నదాతలకు కాస్త ఉపశమనం కలిగింది. వ్యవసాయం చేసే రైతులకు కాస్త పెట్టుబడి పెట్టుకోవడానికి ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అయితే అస్సాంలోని ఓ కార్యక్రమంలో ప్రధాని నరేద్ర మోది పీఎం కిసాన్ 22 వ విడుత నిధులను విడుదల చేశారు. మోత్తం 18,640 కోట్ల రూపాయలను రైతు ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా 9 కోట్ల 32 లక్షల మంది రైతులకు 2000 వేల చోప్పున డబ్బులు అందాయి.

Also Read: Farmer Kits: రైతులకు శుభవార్త.. రాష్ట్రంలో నేడు ఫార్మర్ కిట్స్ పంపిణీ..!

కేంద్రం కొన్ని నియమాలు..

Advertisement

అయితే కొంత మంది రైతులకు ఇంకా డబ్బులు అందలేదు. దీనికి గల ప్రధాన కారణం కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంత మంది ఖాతాలో డబ్బులు జమకాలేదని అధికారులు తెలిపారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక హెల్పలైన్ నెంబర్లను 155261, 1800115526 అందుబాటులోకి తీసుకోచ్చింది. అయితే పీఎం కిసాన్ డబ్బులు పడే అర్హులకు కేంద్రం కొన్ని నియమాలను తప్పని సరి చేసింది. రైతు తమ బ్యాంకు పాసు బుక్కుతో తప్పనిసరిగా కిసాన్ పోర్టల్‌లో తమ పూర్తి వివరాలను అప్టేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబై సైట్ లో పరు కరెక్టుగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇది ఓక వేల చేయక పోతే నిధులు ఆగిపోతాయి. రైతు బ్యాంకు ఎకౌంట్‌కి ఖచ్చితంగా ఆదార్ లింక్ చేసి ఉండాలి. మరీ ముఖ్యంగా ల్యాండ్ సీడింగ్ ప్రక్రియ పూర్తికాకపోయిన మరియు గ్రామ రెవెన్యూ రికార్డుల్లో తప్పులు ఉన్నాగానీ పీఎం కిసాన్ డబ్బులు జమకావు అని అధికారులు తెలిపారు.

మీ సేవా..

పైన తెలిపిన విధంగా ఏదైన కారణం చేత మీ డబ్బులు ఆగిపోతే గ్రామం, మండలంలోని వ్యవసాయ అధికారి వద్దకు వెల్లి మీ సమస్యను తెలిపితే అక్కడి అధికారుల పరిష్కరిస్తారు. అనంతరం మీకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చేలా చేస్తారు. లేదంటే పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా kyc ని అప్డేట్ చేసుకోవచ్చు. లేదా మీ సమీప ప్రాంతంలోని మీ సేవ సెంటర్‌లోకి వెల్లి అక్కడ మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Advertisement

Also Read: Officials Negligence: ఎమ్మెల్యేలను లెక్కచేయని ఆఫీసర్స్.. ఆవేదనతో సీఎంకు తెలిపిన అధికారులు

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×