E-Paper
Advertisement

Mohinabad : యువతి డెత్ కేస్.. SI సస్పెండ్.. CI కు మెమో జారీ..

Mohinabad : యువతి డెత్ కేస్.. SI సస్పెండ్.. CI కు మెమో జారీ..

Mohinabad : మొయినాబాద్ యువతి మృతి కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. మృతురాలు మొయినాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన యువతి తైసీల్ (22)గా గుర్తించారు. ఆమెను ఎవరూ చంపలేదని.. తానే సూసైడ్‌ చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు.

హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ కు సాధారణ తనిఖీ చేసేందుకు వచ్చిన సీపీ.. మొయినాబాద్ యువతి మృతికి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుర్తించారు. ఈ నెల 8 నుంచి ఆ యువతి కనిపించకుండా పోయింది. ఈ నెల 10న తైసీల్‌ కనిపించడం లేదని ఆమె సోదరుడు అజర్‌ ఫిర్యాదు చేశాడు. అయితే ఇప్పటి వరకు హబీబ్ నగర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు.

విషయం తెలుసుకుని పీఎస్‌కు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెళ్లారు.ఈ ఘటనపై విచారణ జరుగుతుందని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు. ఈ తరహా ఘటనలను ఉపేక్షించేదిలేదన్నారు. సీపీ చెప్పినట్టుగానే హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివను సస్పెండ్ చేశారు. ఇన్స్‌పెక్టర్ రాంబాబుకు మెమో జారీ చేశారు.

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి, మృతులు పెరిగే అవకాశం? పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×