OBC Census: కుల గణనలో బీసీల సమగ్ర వివరాలు సేకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 40 ప్రశ్నల్లో ఓబీసీ ప్రస్తావన లేకపోవడంపై కేంద్రంపై మంత్రి పొన్నం తీవ్ర ఆక్షేపణ చేశారు. ఏప్రిల్ 1, 2025న ప్రకటించిన విధంగానే బీసీ గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారో తేలితేనే సామాజిక న్యాయానికి సరైన ప్రణాళికలు పడతాయని మంత్రి పోన్నం స్పష్టం చేశారు.
బీసీలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగాలంటే ప్రామాణిక లెక్కలు అవసరమని, 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేయాలంటే కుల గణన గణాంకాలు కీలకం అన మంత్రి పొన్నం స్పష్టం చేశారు. తెలంగాణలో శాస్త్రీయంగా బీసీ కుల గణన చేసి కోర్టు ముందు వివరాలు ఉంచామని వెల్లడించారు.
బీసీలపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే కుల గణనలో ఓబీసీ వివరాలు చేర్చాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. కేంద్రంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు బీసీ కుల గణనపై స్పందించాలని పొన్నం డిమాండ్ చేశారు. జిత్నీ ఆబాదీ ఉత్నీ హిస్సేదారీ’ నినాదంతో బీసీలకు జనాభా దామాషా మేరకు సామాజిక న్యాయం చేస్తామని వెల్లడించారు.
Also read: దేశంలోనే అత్యంత డర్టీ పొలిటీషియన్ చంద్రబాబే: మాజీ మంత్రి రోజా