E-Paper
Advertisement

Postal Ballots : ఇంకొక్కరోజే సమయం.. అందని పోస్టల్ బ్యాలెట్లు.. అంతా గందరగోళం

Postal Ballots : ఇంకొక్కరోజే సమయం.. అందని పోస్టల్ బ్యాలెట్లు.. అంతా గందరగోళం
telangana election latest news

Postal Ballots news(Telangana election latest news):

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కు ఒక్క రోజే టైం ఉంది. అయినప్పటికీ ఇంకా.. రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై గందరగోళం కొనసాగుతున్నది. ఈ సమస్యపై పలు చోట్ల ఉద్యోగులుఆందోళనకు దిగిన సందర్భాలను మనం చూశాం. 119 సెగ్మెంట్లలో దాదాపు 3 లక్షల మంది ఎలక్షన్‌ డ్యూటీలో ఉండగా.. అందులో లక్షా 60 వేల మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓట్లు వేసేందుకు ఈసీ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు 80 వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను వినియోగించుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కు వినియోగించుకోకుండా కొందరు అడ్డుపడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాజాగా పోస్టల్ బ్యాలెట్ కోసం Ceo వికాస్ రాజ్ నీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కలిశారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న దాదాపు 80వేల మంది ఉపాధ్యాయులకు సరిగ్గా పోస్టల్ బ్యాలెట్ అందలేదని సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. డిసెంబర్‌ 2వ తేదీ వరకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలంటున్నారు. ఓటు విలువ తెలిపే మాకే ఓటు వేసే అవకాశం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై రెండురోజులుగా గందరగోళం నెలకొనగా.. ఎలక్షన్ కమిషన్ సీఈఓ వికాస్ రాజ్ అందరికీ పోస్టల్ బ్యాలెట్లను అందజేస్తామని చెప్పారు. కానీ.. ఇంకా సుమారు 70 వేల మందికి పోస్టల్ బ్యాలెట్లు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

.

.

.

.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×