E-Paper
Advertisement

Praja Bhavan Car Accident Case : ప్రజాభవన్‌ వద్ద కారు బీభత్సం కేసు.. మాజీ ఎమ్మెల్యే షకీల్‌పైనా కేసు..

Praja Bhavan Car Accident Case : ప్రజాభవన్‌ వద్ద కారు బీభత్సం కేసు.. మాజీ ఎమ్మెల్యే షకీల్‌పైనా కేసు..
Advertisement

Praja Bhavan Car Accident Case : హైదరాబాద్ లోని ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం సృష్టించిన కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై కూడా కేసు నమోదైంది. ఆయన పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. షకీల్‌ కుమారుడు సాహిల్ గతేడాది డిసెంబర్ లో కారును వేగంగా నడుపుతూ ప్రజాభవన్‌ ఎదుట ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీకొట్టాడు. ఈ కేసు నుంచి కొడుకును షకీల్ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. సాహిల్‌ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఎస్ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌కు నోటీసులు ఇచ్చారు.

సీఐను మభ్యపెట్టారన్న ఆరోపణలపై షకీల్‌తోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. ఈ ఘటనలో మొత్తం 10 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం ఘటన తర్వాత సాహిల్ దుబాయ్ పరారయ్యాడు. ఈ నేపథ్యంలోనే లుకౌట్‌ నోటీసులు పోలీసీలు జారీ చేశారు. అప్పటికే దుబాయ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్.. తన కుమారుడిని దుబాయ్‌కి పిలిపించుకున్నారని వార్తలు వచ్చాయి.. తాజాగా షకీల్‌తో పాటు మరో ఇద్దరిపైనా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు.

Advertisement

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×