E-Paper
Advertisement

CM Revanth Reddy: చెప్పినట్టే బరాబర్ చేసి చూపించాం.. కాదని ప్రూఫ్ చేయగలరా, ఇదే నా ఛాలెంజ్

CM Revanth Reddy: చెప్పినట్టే బరాబర్ చేసి చూపించాం.. కాదని ప్రూఫ్ చేయగలరా, ఇదే నా ఛాలెంజ్

CM Revanth Reddy: తెలంగాణలో చేపట్టిన కులగణన ఈ సర్వే నూటికి నూరుపాల్లు నిజమైనదని.. ప్రజలే స్వయంగా ఇచ్చిన వివరాలే ఇందులో పొందుపరిచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో ఎవరికైనా ఇదే నా ఛాలెంజ్ అని సీఎం సవాల్ విసిరారు. రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుటుంబ సర్వేపై కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీలో ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ ప్రజెంటేషన్‌కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, తదితర కీలక నేతలు హాజరయ్యారు.  ఈ సందర్భంగానే సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

చెప్పాం.. చేసి చూపించాం..

దేశానికి ఒక దిశను చూపించేలా కులగణన సర్వే చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో దాదాపు వందేళ్ల తర్వాత ఈ ప్రక్రియను నిర్వహించామని చెప్పారు. ‘భారత్ జోడో యాత్రలో రాహుల్ కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కులగణన చేస్తామని స్పష్టం చేశారు.. చేసి చూపించాం. తెలంగాణ మోడల్ అంటే ఏంటో వివరించేందుకే ఈ ప్రజెంటేషన్ నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వేపై అగ్రకులాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. కానీ పరిస్థితులను బట్టి మందుకు సాగాలని వారికి నచ్చజెప్పా.. మనం సంతోషంగా ఈ పని చేయాల్సిందే’ అని చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు..

మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని.. లీగల్ గా ఓబీసీ అయ్యారని సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. ‘ఓబీసీల కోసం మోదీ మనస్ఫూర్తిగా ఏమీ చేయరు.. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే త్యాగాలు చేసింది.. కేంద్రం కులగణనకు సిద్ధం కావడం వెనుక కారణం రాహుల్ గాంధీనే.. ఆనాడు రైతు నల్ల చట్టాలను వెనక్కి తీసుకురావడానికి కారణం కూడా రాహుల్ గాంధీనే.. కులగణనకు ఆర్ఎస్ఎస్ పూర్తి వ్యతిరేకం.. తెలంగాణ కోసం ఏళ్ల తరబడి పోరాటాలు చేశాం. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు’ అని సీఎం చెప్పారు.

ప్రజలు ఇచ్చిన వివరాలే పొందుపరిచాం…

‘రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కులగణన ప్రక్రియ నిర్వహించాం.. ఏడాదిలోనే కులగణన పూర్తి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టాం.. కాంగ్రెస్ ఉంటే అన్నీ ఉంటాయి.. కాంగ్రెస్ లేకపోతే ఏమీ ఉండవు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే త్యాగాలు చేసింది. రాష్ట్రంలో చేపట్టిన సర్వే నూటికి నూరుపాల్లు నిజమైనది.. ప్రజలే స్వయంగా ఇచ్చిన వివరాలే ఇందులో పొందుపరిచాం. ఈ విషయంలో ఎవరికైనా ఇదే నా ఛాలెంజ్’ అని సీఎం రేవంత్ సవాల్ విసిరారు.

ALSO READ: Heavy Rains: ఈ రెండు మాత్రం జాగ్రత్తగా ఉండాలే.. కుండపోత వర్షం.. ఇంట్లోనే ఉండండి..

ALSO READ: NMDC LIMITED: డిగ్రీ పాసైతే చాలు భయ్యా.. రూ.2,60,000 జీతంతో ఉద్యోగాలు.. డోంట్ మిస్

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×