E-Paper
Advertisement

Pv narasimha rao: పీవీకి నివాళి.. ఆర్థిక వ్యవస్థను మార్చిన మేధావిగా వర్ణించిన సీఎం రేవంత్..

Pv narasimha rao: దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నర్సింహ్మరావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం పీవి నరసింహారావు వర్థంతి సందర్భంగా పీవీ జ్ఞాన భూమి వద్ద ఆయనకు ఘనంగా నివాళ్లు అర్పించారు. పీవీ నరసింహారావు పరిపాలనలో అనేక మార్పులు తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిన గొప్ప మహనీయుడు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.

Pv narasimha rao: పీవీకి నివాళి.. ఆర్థిక వ్యవస్థను మార్చిన మేధావిగా వర్ణించిన సీఎం రేవంత్..
Advertisement

Pv narasimha rao: దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నర్సింహ్మరావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం పీవి నరసింహారావు వర్థంతి సందర్భంగా పీవీ జ్ఞాన భూమి వద్ద ఆయనకు ఘనంగా నివాళ్లు అర్పించారు. పీవీ నరసింహారావు పరిపాలనలో అనేక మార్పులు తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిన గొప్ప మహనీయుడు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.

పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారన్నారు . దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని సీఎం అన్నారు. బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై పీపీ ఒక మాట చెప్పారన్నారు. తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటాడు అని చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పీవీ సంస్కరణలు సదా ఆచరణీయమని.. దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చాడన్నారు.

Advertisement

పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్లను అభివృద్ది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని.. పీవీ నరసింహారావు కీర్తిని పెంచేలా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. అనంతరం పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. నివాళ్లు అర్పించిన వారిలో మంత్రులు కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పీవీ నరసింహారావు వర్థంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ఘనంగా నివాళ్లు అర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఘనత పీవీ నరసింహారావుకే సొంతమని అన్నారు. విద్యా వ్యవస్థతో సహా సామాజిక మార్పులకు కృషి చేశారన్నారు. భూ సంస్కరణలు అమలు చేసిన వ్యక్తి పీవీ అని భట్టి కొనియాడారు.

Tags

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×