BigTV English

Phone Tapping Case : కీలకదశకు ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు.. ఎవరు ఆ నలుగురు నేతలు ?

Phone Tapping Case : కీలకదశకు ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు.. ఎవరు ఆ నలుగురు నేతలు ?

Latest Update on Phone Tapping Case(Telangana today news) : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలకదశకు చేరుకుంది. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇప్పటివరకు ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీస్ అధికారులను విచారించిన దర్యాప్తు బృందం, రాజకీయ ప్రముఖుల ప్రమేయం కూడా ఉందని తేలడంతో వారికి కూడా నోటీసులు పంపేందుకు సిద్ధమైంది. వీరికి సంబంధించిన ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. మరోవైపు ఏ-4 నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో నలుగురు నేతల పేర్లు వెల్లడించినట్లు తెలిసింది. ఇప్పుడు ఆ నలుగురు ఎవరన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.


ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-4 నిందితుడు రాధాకిషన్ రావు కస్టడీలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ను పోలీసులు సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందించారు. రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారంతో పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దర్యాప్తు బృందం నేడు మరికొందరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారించనుంది. ఇప్పటికే అరెస్టయిన నలుగురు నిందితుల నుండి దర్యాప్తు బృందం కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. రాధాకిషన్ రావు స్టేట్ మెంట్‌ లో ఓ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతల పేర్లు ఉన్నట్టు సమాచారం.

మరోవైపు రాధాకిషన్ రావు జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగుస్తుంది. నేడు ఆయనను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఆయన కస్టడీని పొడిగించే అవకాశం ఉంది. కాగా.. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ఆధారంగా పంజాగుట్ట పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంపై నాంపల్లి కోర్టు ఈ నెల 15న నిర్ణయం తీసుకోనుంది.


Tags

Related News

Hyderabad Water Cut: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. నగరంలో రెండు రోజులు తాగునీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్

Telangana: భయం గుప్పిట్లో చందనపల్లి గ్రామం.. నెల రోజుల్లో 20 మంది బలి

CM Progress Report: దేశానికే ఆదర్శం టీ -ఫైబర్.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణ

Telangana Bandh: ఈనెల 14న తెలంగాణ రాష్ట్రా బంద్.. ఎందుకంటే..?

Global Study Expo 2025: గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో- 2025, తక్కువ ఖర్చుతో విదేశీ విద్య, స్టూడెంట్స్ మాటల్లో

Hyderabad Accident: ఎల్‌బీనగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం, బైక్‌ని ఢీ కొట్టిన కారు, నుజ్జుయిన కారు

Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు

Vemulawada Temple: రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు.. రేపటి నుంచి భీమేశ్వరాలయంలో దర్శనాలు

Big Stories

×