Sangareddy News: తెలంగాణలో వరుస ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు పెద్దగా కనిపించని ఈ వ్యవహారం, ఇప్పుడు క్రమంగా రెట్టింపు అయినట్టు కనిపిస్తోంది. గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల వంతైంది. ఇలా ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో ర్యాగింగ్ వ్యవహారాలు జోరుగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. తాజాగా సంగారెడ్డి మెడికల్ కాలేజీ స్టూడెంట్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
ప్రభుత్వ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు
సంగారెడ్డిలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగింది. బుధవారం రాత్రి ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సంగారెడ్డి పట్టణానికి చెందిన ఓ విద్యార్థి మెడికల్ కాలేజీలో ఫస్టియర్ చదువుతున్నాడు.
మంగళవారం రాత్రి కళాశాలలో ఓ వేడుక సందర్భంగా దుస్తులు విప్పేసి డ్యాన్స్ చేయాలని జూనియర్ విద్యార్థిపై సీనియర్లు ఒత్తిడి చేశారు. ఈ విషయాన్ని సదరు విద్యార్థి ఫ్యామిలీ సభ్యులకు తెలిపాడు. దీనిపై ఆగ్రహించిన అతడి సోదరుడు, మహబూబ్సాగర్ చెరువు వద్దకు రావాలని వారికి కబురు పెట్టాడు. వెంటనే ఇద్దరు సీనియర్లు అక్కడికి చేరుకున్నారు.
జూనియర్ ఇంటిపైకి 50 మంది విద్యార్థులు
ఈలోగా వారితో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలియగానే కళాశాల నుంచి సుమారు 50 మంది సీనియర్లు శాంతినగర్కు జూనియర్ విద్యార్థి ఇంటికి చేరుకున్నారు. వారి ఇంటిపై దాడికి యత్నించారు. ఈ ఘటనలో జూనియర్ విద్యార్థి తండ్రికి గాయాలు అయ్యాయి. ఆయన్ని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఈ వ్యవహారంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకుని ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కాలేజీ అధికారులు, ర్యాగింగ్ కమిటీ సభ్యులతో పోలీసులు చర్చలు జరిపారు. మొత్తానికి ర్యాగింగ్ వ్యవహారం కాస్త పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. మరి పోలీసులు.. విద్యార్థుల మధ్య ఏ విధంగా రాజీ చేస్తారో చూడాలి.
ALSO READ: తెలంగాణ పోలీసు కమిషనరేట్ వెబ్ సైట్ హ్యాక్