BigTV English

Raghunandan Rao : దేశంలోనే అతిపెద్ద స్కాం.. కాళేశ్వరంపై విచారణ చేయాలి.. రఘనందన్ డిమాండ్..

Raghunandan Rao : దేశంలోనే అతిపెద్ద స్కాం.. కాళేశ్వరంపై విచారణ చేయాలి.. రఘనందన్  డిమాండ్..

Raghunandan Rao : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘనందన్ రావు ఆరోపించారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపింపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టు పై 2008 సంవత్సరంలో సమీక్ష నిర్వహించారని గుర్తుచేశారు. 160 టీఎంసీలతో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అందించే విధంగా ప్రణాళికలు రూపొందించారని వివరించారు.


తిరిగి వైఎస్ హయాంలోనే మరో 2 లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా ఆయకట్టు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ వివరాలు అందించాలని మార్చిలోనే కాగ్ లేఖ రాసిన ప్రస్తావించారు. అయితే ఈ అంశంపై గత కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదన్నారు. భారీ అవినీతికి పాల్పడ్డారని అందుకే నివేదికలు సమర్పించలేదని ఆరోపించారు.

దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిందని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ రఘునందన్ రావు చేశారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×