Rahul Gandhi: తెలంగాణస్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ లో జిల్లా అధ్యక్షుల పదవులే పవర్ పుల్ అంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన వికారాబాద్ లోని డీసీసీ అధ్యక్షుల కార్యక్రమంలో మాట్లాడుతూ..స్టేట్ కుటీపీసీసీ పదవి ఎంత కీలకమో..జిల్లాలకు డీసీసీలు కూడా సుప్రీంలే అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలోని పదవులు కంటే పార్టీ పదవులే ఏఐసీసీలో గుర్తింపు నిస్తాయన్నారు. కష్టపడి పనిచేస్తే ఆటోమెటిక్ గా పదవులు వస్తాయని, ఏమీ ఆశించకుండా పనిచేసుకుంటూ ముందుకు సాగాలని, అప్పుడే విజయాలు వరిస్తాయన్నారు. పనిచేసినోళ్లకు పదవులు కచ్చితంగా వస్తాయన్నారు. మహాత్మగాంధీ ఒంటిపై బట్ట తప్పా, ఏమీ లేదని, కానీ దేశం కోసం పోరాడారన్నారు.
Also Read: Upcoming JioHotstar releases : ఈ నెలలో జియోహాట్స్టార్లో వస్తున్న సరికొత్త సిరీస్ లు ఇవే
బ్రిటీష్ వాళ్లు ఆయన పోరాట స్పూర్తిని చూసి ఏమీ చేయలేకపోయారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇండియా ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షోంభం నుంచి బయట పడాలంటే కాంగ్రెస్ పవర్ లోకి రావాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. పాకిస్థాన్ కు చైనా సపోర్టు చేస్తుందని, ఇరాన్ వెనక చైనా రష్యా ఉందని రాహుల్ వెల్లడించారు. ట్రంప్ మోదీకి సరెండర్ అయిపోయారన్నారు. ట్రంప్ కు వ్యతిరేకంగా మోడీ పనిచేయలేని పరిస్థితి నెలకొన్నదన్నారు. దేశ ప్రజల కోసం మోడీ తన అహాన్ని పక్కకు పెట్టి పనిచేయాలని సూచంచారు. ఇక రాష్ట్ర పార్టీ నాయకులు కూడా ప్రభుత్వంతో సమన్వయమై వర్క్ చేయాలన్నారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంగా ముందుకు సాగాలన్నారు. గతంలో డీసీసీలుగా పనిచేసిన వారికి చాలా మందికి ఎమ్మెల్యే టిక్కెట్లు వచ్చాయని, భవిష్యత్ లోనూ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని తయారు చేసేందుకు డీసీసీలంతా కష్టపడి పనిచేయాలని సూచించారు.