Weather Report in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిస్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం దక్షిణ కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తనం సోమవారం దక్షిణ కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిందని తెలిపింది.
ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 24వ తేదీ వరకు వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీంతో తెలంగాణలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read: తెలంగాణలో భారీ వర్షం.. ముగ్గురు మృతి..!
మంగళవారం భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సంగారెడ్డి, మెదక్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. 22 వ తేదీ వికారాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, మెదక్, హైదారాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.