E-Paper
Advertisement

Road Accident: సంగారెడ్డిలో కారును ఢీకొట్టిన ట్రక్కు..ఇద్దరు స్పాట్ డెడ్

Road Accident: సంగారెడ్డిలో కారును ఢీకొట్టిన ట్రక్కు..ఇద్దరు స్పాట్ డెడ్

Road Accident in SangaReddy (Telangana News): సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. న్యాల్‌కల్ మండంలోని హుసెల్లి వద్ద వేగంగా వచ్చిన ఓ ట్రక్కు..కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.

జహీరాబాద్ – బీదర్ రహదారిపై సోమవారం ఉదయం కారును ట్రక్కు ఢీకొట్టడంతో కారు డ్రైవర్ తోపాటు ఓ మహిళ మృతి చెందింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానికులు జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు కర్ణాటకలోని బీదర్ వాసులుగా గుర్తించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం ప్రమాదం చోటుచేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ట్రక్కు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×