Sama Ram Mohan Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ మానసిక పరిస్థితి సరిగా లేదంటూ ఘాటు విమర్శలు చేశారు. అంతేకాకుండా ఆయనకు మెడిసన్ సైతం పంపిస్తున్నట్లు ప్రకటించారు. కేటీఆర్ సైకలాజికల్ గా ఇబ్బంది పడుతున్నాడని.. తప్పుడు మెడిసన్ తీసుకోవడం వల్లే ఆయన ఇలా మాట్లాడుతున్నారని వైద్యులు సైతం చెబుతున్నట్లు సామ రామ్మోహన్ ఆరోపించారు.
రాజకీయాల్లో పిచ్చోళ్ళు ఉంటే ఎలా ఉంటుందో చెప్పడానికి కేటీఆర్ ఉదాహరణ అంటూ సామ రామ్మోహన్ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేదాక కేటీఆర్ ఆగేలా లేడన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాశనం కావడానికి కారణమే కేటీఆర్ అని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి హైట్ గురించి పదే పదే ప్రస్తావిస్తున్న కేటీఆర్ కు ఈ సందర్భంగా సామా చురకలు అంటించారు. కేటీఆర్ పక్కనున్న అనేక నాయకులు పొట్టిగానే ఉన్నారన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా పొట్టిగానే ఉన్నట్లు గుర్తుచేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలపై.. బీజేపీ, బీఆర్ఎస్ వ్యక్తిగత దూషణలు చేస్తోందని సామా రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ‘కేటీఆర్ పిచ్చిగా మాట్లాడుతున్నారు. కారుకు ఓటేయకపోతే కళ్ళు పోతాయని కేటీఆర్ శాపనార్థాలు పెడుతున్నాడు. కేటీఆర్ బుర్రలో గుజ్జు లేదు. కేటీఆర్ వయసు పెరిగిందే కానీ విజ్ఞత లేదు. బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి. గజ్వేల్, సిరిసిల్లాలో ప్రజలు బీఆర్ఎస్ నేతలను తరుముతున్నారు. ప్రజలు తరిమితే మల్లన్నసాగర్ లో మునిగిన హరీష్ మంచిర్యాలలో తేలాడు. కేటీఆర్ మానసిక పరిస్థితిని బీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాలి. కోర్టు పరిధిలో ఉన్న ఆధారాలను తగలపెట్టారని ఆరోపణలు చేయడమేంటి? సిరిసిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోతుంది’ అంటూ సామ రామ్మోహన్ చెప్పుకొచ్చారు.
Also Read: Ambati Rambabu: పోసాని గతే అంబటికి పట్టనుందా? 8 రోజుల్లో 36 కేసులు.. రాష్ట్రమంతా తిప్పే ప్లాన్!