E-Paper
Advertisement

ఆర్టీసీలో కలకలం.. లంచం అడిగిన అధికారికి ‘చెప్పు’తో బుద్ధి చెప్పిన కండక్టర్!

ఆర్టీసీలో కలకలం.. లంచం అడిగిన అధికారికి ‘చెప్పు’తో బుద్ధి చెప్పిన కండక్టర్!
Advertisement

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో టీజీఎస్‌ఆర్‌టీసీ చెకింగ్ అధికారిపై కండక్టర్, ప్రయాణికులు దాడి చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయకోడ్ సమీపంలో టికెట్ స్క్వాడ్ తనిఖీ కోసం ఆపారు. అయితే, బస్సులో ఒక ప్రయాణికుడి వద్ద టికెట్ లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు.

సాధారణంగా ఇలాంటి సమయంలో జరిమానా వేయాలి, కానీ సదరు చెకింగ్ అధికారి మాత్రం అడ్డదారి తొక్కారు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే కండక్టర్, ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. చిన్న పొరపాటుకు అంత పెద్ద మొత్తంలో డబ్బు అడగడంతో కండక్టర్ సహనం కోల్పోయారు.

Advertisement

అవినీతికి పాల్పడుతున్న అధికారి తీరుపై ఆగ్రహించిన కండక్టర్, వెంటనే తన చెప్పు తీసి సదరు అధికారిని చితకబాదాడు. ఇది చూసిన మిగతా ప్రయాణికులు కూడా కండక్టర్‌కు మద్దతుగా నిలిచి, అధికారిపై దాడికి దిగారు. లంచం అడిగిన అధికారికి అక్కడికక్కడే బుద్ధి చెప్పిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తప్పును సరిదిద్దాల్సిన అధికారి లంచం అడగడం ఏంటని జనం మండిపడుతున్నారు.

Also Read: మే 6న రైతు సదస్సు.. అడ్డుకుంటే ఆగేదేలే.. ప్రభుత్వానికి పోచంపల్లి హెచ్చరిక

Advertisement

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×