E-Paper
Advertisement

ఆర్టీసీలో కలకలం.. లంచం అడిగిన అధికారికి ‘చెప్పు’తో బుద్ధి చెప్పిన కండక్టర్!

ఆర్టీసీలో కలకలం.. లంచం అడిగిన అధికారికి ‘చెప్పు’తో బుద్ధి చెప్పిన కండక్టర్!
Advertisement

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో టీజీఎస్‌ఆర్‌టీసీ చెకింగ్ అధికారిపై కండక్టర్, ప్రయాణికులు దాడి చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయకోడ్ సమీపంలో టికెట్ స్క్వాడ్ తనిఖీ కోసం ఆపారు. అయితే, బస్సులో ఒక ప్రయాణికుడి వద్ద టికెట్ లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు.

సాధారణంగా ఇలాంటి సమయంలో జరిమానా వేయాలి, కానీ సదరు చెకింగ్ అధికారి మాత్రం అడ్డదారి తొక్కారు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే కండక్టర్, ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. చిన్న పొరపాటుకు అంత పెద్ద మొత్తంలో డబ్బు అడగడంతో కండక్టర్ సహనం కోల్పోయారు.

Advertisement

అవినీతికి పాల్పడుతున్న అధికారి తీరుపై ఆగ్రహించిన కండక్టర్, వెంటనే తన చెప్పు తీసి సదరు అధికారిని చితకబాదాడు. ఇది చూసిన మిగతా ప్రయాణికులు కూడా కండక్టర్‌కు మద్దతుగా నిలిచి, అధికారిపై దాడికి దిగారు. లంచం అడిగిన అధికారికి అక్కడికక్కడే బుద్ధి చెప్పిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తప్పును సరిదిద్దాల్సిన అధికారి లంచం అడగడం ఏంటని జనం మండిపడుతున్నారు.

Also Read: మే 6న రైతు సదస్సు.. అడ్డుకుంటే ఆగేదేలే.. ప్రభుత్వానికి పోచంపల్లి హెచ్చరిక

Advertisement

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×