Sangareddy: సంగారెడ్డి జిల్లాలో టీజీఎస్ఆర్టీసీ చెకింగ్ అధికారిపై కండక్టర్, ప్రయాణికులు దాడి చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయకోడ్ సమీపంలో టికెట్ స్క్వాడ్ తనిఖీ కోసం ఆపారు. అయితే, బస్సులో ఒక ప్రయాణికుడి వద్ద టికెట్ లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు.
సాధారణంగా ఇలాంటి సమయంలో జరిమానా వేయాలి, కానీ సదరు చెకింగ్ అధికారి మాత్రం అడ్డదారి తొక్కారు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే కండక్టర్, ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. చిన్న పొరపాటుకు అంత పెద్ద మొత్తంలో డబ్బు అడగడంతో కండక్టర్ సహనం కోల్పోయారు.
అవినీతికి పాల్పడుతున్న అధికారి తీరుపై ఆగ్రహించిన కండక్టర్, వెంటనే తన చెప్పు తీసి సదరు అధికారిని చితకబాదాడు. ఇది చూసిన మిగతా ప్రయాణికులు కూడా కండక్టర్కు మద్దతుగా నిలిచి, అధికారిపై దాడికి దిగారు. లంచం అడిగిన అధికారికి అక్కడికక్కడే బుద్ధి చెప్పిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తప్పును సరిదిద్దాల్సిన అధికారి లంచం అడగడం ఏంటని జనం మండిపడుతున్నారు.
Also Read: మే 6న రైతు సదస్సు.. అడ్డుకుంటే ఆగేదేలే.. ప్రభుత్వానికి పోచంపల్లి హెచ్చరిక
లంచం అడిగిన టికెట్ ఇన్స్పెక్టర్ని.. చెప్పుతో కొట్టిన కండక్టర్
సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సులో టికెట్ లేదని కేసు పెట్టకుండా ఉండడానికి ప్రయాణికుడి నుండి, కండక్టర్ నుండి రూ.20 వేలు లంచం అడిగినందుకు.. చెకింగ్ అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, ప్రయాణికులు#RTC #Conductor pic.twitter.com/O6qSS9h1bf
— Swetcha Daily News (@SwetchaNews) May 1, 2026