E-Paper
Advertisement

SB Organics Factory Fire Accident: సంగారెడ్డి ఫ్యాక్టరీ ప్రమాదం.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య

SB Organics Factory Fire Accident: సంగారెడ్డి ఫ్యాక్టరీ ప్రమాదం.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య
Advertisement

SB Organics Factory Fire Accident

6 People Died in SB Organics Factory Fire Accident: సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య ఆరుకు చేరింది. బుధవారం (ఏప్రిల్ 3) సాయంత్రం 4 గంటలకు జరిగిన ఈ అగ్నిప్రమాదంలో రెండు రియాక్టర్లు పేలడంతో.. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతంలో మరో మృతదేహం లభ్యమవ్వడంతో.. మృతుల సంఖ్య ఆరుకు చేరింది. కాగా.. బుధవారం మొత్తం 60 మంది ఉద్యోగులు విధులకు హాజరవ్వగా.. 30 మంది ఉద్యోగుల ఆచూకీ మాత్రమే లభ్యమైంది. మిగతా 30 మంది ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

కాగా.. మృతుల్లో కంపెనీ డైరెక్టర్ రవివర్మ (38) కూడా ఉన్నారు. గురువారం ఉదయం కనిపించిన మృతదేహాన్ని హత్నూర మండలం కొన్యాలకు చెందిన వడ్డె రమేశ్ (38)గా గుర్తించారు. నిన్న మృతి చెందిన వారు తమిళనాడుకు చెందిన దయానంద్ (48), విజయవాడకు చెందిన సుబ్రహ్మణ్యం (36), మధ్యప్రదేశ్ కు చెందిన సురేష్ పాల్ (54), చందాపూర్ కు చెందిన చాకలి విష్ణు (35)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రమాదంలో గాయపడిన 16 మందిని సంగారెడ్డి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు.

Also Read: కొమురం భీం జిల్లాలో ఏనుగు బీభత్సం.. 24 గంటల్లో ఇద్దరు రైతులు మృతి

Advertisement

రియాక్టర్ పేలుడు తీవ్రతకు సమీపంలోని నిర్మాణాలు కూలిపోయాయి. ఈ ఘటనలో మొత్తం 100 కోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించినట్టు పోలీసులు అంచనా వేశారు. శకలాలను తొలగిస్తేకానీ మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశంలేదని భావిస్తున్నారు. ఈ కంపెనీ పక్కనే ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ కూడా పూర్తిగా దగ్ధం కావడంతో 50 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఫ్యాక్టరీ యాజమాన్యం పేర్కొంది.

Tags

Related News

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

Big Stories

Advertisement
×