E-Paper
Advertisement

గుండ్ల పోచంపల్లిలో బయటపడ్డ నయా భూ దందా.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్..!

గుండ్ల పోచంపల్లిలో బయటపడ్డ నయా భూ దందా.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్..!

Land Encroachment: స్వేచ్చ బ్యూరో: గుండ్లపోచంపల్లి–మైసమ్మగూడ శివార్లలో ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన భూముల కబ్జా వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. కబ్జాకు గురైన 49 ఎకరాల 20 గుంటల భూములను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం పరిశీలించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళిత విద్యార్థుల భవిష్యత్తు కోసం 1991లో సర్వే నంబర్ 509లో 49 ఎకరాల 20 గుంటల భూమిని ఎస్సీ కార్పొరేషన్‌కు కేటాయించారని గుర్తు చేశారు.

మంత్రి గరం గరం..

అయితే గత పాలకుల అండదండలతో కొందరు ప్రభావశీలులు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమించి కోట్ల రూపాయల సామ్రాజ్యాలు నిర్మించుకున్నారని విమర్శించారు.”కబ్జా చేసిన వారి పేర్లు చెప్పి నా స్థాయిని తగ్గించుకోను. కానీ దళితుల హక్కులను హరించిన వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దళితుల కోసం కేటాయించిన భూములను ఆక్రమిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేసిన మంత్రి.. గుండ్లపోచంపల్లిలోని 49.20 ఎకరాల భూమిని వెంటనే సర్వే చేసి ఎస్సీ కార్పొరేషన్‌కు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

Also Read: ఆ డాక్యుమెంటరీ చూసి ఎమోషనల్ అయిన ధనుష్.. ‘ఎప్పటికీ నువ్వే GOAT’ అంటూ..’

అక్రమార్కులపై ఉక్కుపాదం..

ప్రభుత్వ భూములు, రైతుల భూములను కబ్జా చేయాలని చూసే భూ బకాసురులపై ఉక్కుపాదం మోపుతామని, ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నా ఉపేక్షించబోమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. మంత్రి వెంట మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, జిల్లా కలెక్టర్ మనూ చౌదరి, మాజీ డీసీసీ హరివర్ధన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు, గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సాయి పేట శ్రీనివాస్,మండల అధ్యక్షుడు రమణ రెడ్డి,మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఇలాంటి ఇల్లు ఉంటే.. లైఫ్‌లో ఏసీ, కూలర్ అక్కర్లేదు.. 40 ఏళ్లుగా 10°C ఉష్ణోగ్రత!

Related News

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. మరో గంటలో ఆ ప్రాంతాల్లోనూ భారీ వర్షం!

Medak District: మెదక్ జిల్లా ఉద్యమకారులకు బీ అలర్ట్.. రేపే సమావేశం..!

తెలంగాణవాసులకు రెయిన్ అలర్ట్.. సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌లో భారీ వర్షం, బుధవారం పలు జిల్లాల్లో

జగిత్యాలలో మారిన పొలిటికల్ సీన్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జీవన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!

కారు మునిగిపోయింది.. ఇప్పటికైనా డ్రామాలు ఆపండి.. బీఆర్ఎస్‌పై మంత్రి సంచలన వ్యాఖ్యలు!

Ramchander Rao: తెలంగాణ సొమ్ము ఇటలీకి వెళ్తోందా.. సీఎం రేవంత్‌ పై రాంచందర్ రావు ఫైర్!

Medak News: మెదక్ కలెక్టరేట్ మెట్లెక్కిన మత్స్యకారులు.. ఎడినీ సస్పెండ్ చేయాలని డిమాండ్!

×