E-Paper
Advertisement

Water Crisis: నిప్పులు చెరుగుతున్న భానుడు.. కంటికి కనిపించని చలివేంద్రాలు

Water Crisis: నిప్పులు చెరుగుతున్న భానుడు.. కంటికి కనిపించని చలివేంద్రాలు
Advertisement

Water Crisis: స్వేచ్ఛ బ్యూరో: మార్చి నెలలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భానుడు నిప్పులు చెరుగుతుండటంతో పట్టణ ప్రజలు అల్లాడిపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం విలవిల్లాడుతున్నా, ప్రజల దాహార్తిని తీర్చాల్సిన మున్సిపల్ యంత్రాంగం మాత్రం ‘మొద్దునిద్ర’ పోతోంది. ప్రతి ఏటా వేసవి కాలం ప్రారంభంలోనే ఏర్పాటు చేయాల్సిన చలివేంద్రాల ఊసే ఎత్తకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గాలికి వదిలేసిన ప్రజా సౌకర్యాలు

గతంలో వేసవి కాలం రాగానే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని కీలక ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసేవారు. ముఖ్యంగా ప్రధాన బస్టాండ్ ఆవరణ, అంబేద్కర్ చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం ఎదుట వంటి రద్దీ ప్రాంతాల్లో కుండలతో నీటి సౌకర్యం కల్పించేవారు. దీనివల్ల సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు, నిరుపేద కూలీలు, చిరు వ్యాపారులు తమ దాహాన్ని తీర్చుకునేవారు. కానీ, ప్రస్తుత పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సౌకర్యాలను గాలికొదిలేసిందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.

Advertisement

Also Read: Delimitation: డీ లిమిటేషన్ అంశంతో నేతల్లో టెన్షన్ టెన్షన్.. పాత నాయకులకు చుక్కలేనా..?

కొనే స్తోమత లేక.. అల్లాడుతున్న పేదలు

బయట వాటర్ బాటిళ్ల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ఎండలో తిరిగే పేదలు, సామాన్యులు నీటిని కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఏసీ గదులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిస్థితులను చూడాలని స్థానికులు కోరుతున్నారు. “ఎండలు ముదురుతున్నా అధికారులు కనీసం స్పందించకపోవడం దారుణం. వెంటనే ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాంమని హుజూరాబాద్ వాసులు డిమాండ్ చేసారు.

Advertisement

Also Read: Bellamkonda srinivas wedding: బెల్లం కొండ సాయి శ్రీనివాస్ కావ్య పెళ్లి పిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×