E-Paper
Advertisement

షాబాద్ ఆరుగురి హత్య కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య!

షాబాద్ ఆరుగురి హత్య కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య!
Advertisement

Shabad Murder: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసి పరారైన నిందితుడు రాజ్ కుమార్ కథ విషాదాంతమైంది. స్థానికుల నుంచి అందిన సమాచారంతో పోలీసులు అతని మృతదేహాన్ని కొత్తూరు సమీపంలో కనుగొన్నారు. కొత్తూరు మండలం పంజర్ల పరిధిలోని ఒక ఓపెన్ వెంచర్‌లో రాజ్ కుమార్ శవమై కనిపించాడు. మృతదేహం పక్కనే పురుగుల మందు బాటిల్ లభ్యం కావడంతో, అతడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పంజర్ల వెంచర్‌లో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే ‘డయల్ 100’ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, అది షాబాద్ హంతకుడు రాజ్ కుమార్ దేనని అధికారికంగా ధ్రువీకరించారు. ఆరుగురి ప్రాణాలను బలిగొన్న నిందితుడు, పోలీసులకు దొరకకుండా ఇలా చనిపోవడం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

Related News

Jubilee Hills BRS: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్‌లో ఊహించని షాక్.. ఆ ప్రోగ్రామ్స్‌కి వెలితే బ్లాక్ లిస్ట్‌లో పేరు..?

HILT Policy: హైదరాబాద్‌లో హిల్ట్ పాలసీ ఫెయిల్.. చిక్కుల్లో కాంగ్రెస్ సర్కార్..?

Road Encroachments: సర్కారు భూమిలో అక్రమ గోడ నిర్మాణం.. పట్టించుకోని అధికారులు!

ప్రిన్సిపాళ్ల మధ్య ఈగో వార్.. రోడ్డున పడ్డ 200 మంది విద్యార్థినులు, అసలేం జరిగిందంటే?

యాదాద్రి జిల్లాలో మోసం.. ఫొటో తీస్తామని నమ్మించి.. 3 తులాల బంగారం కాజేశారు!

రూ. 100 కోసం ఇంత నీచమా? ర్యాపిడో రైడర్‌ను నడిరోడ్డుపై వేధించిన యువతి.. వీడియో వైరల్

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. రేపు కాలేజీలకు సెలవు.. ఎందుకంటే?

Big Stories

Advertisement
×