Road Encroachments: స్వేచ్ఛ బ్యూరో: ఎల్లంపేట్ మున్సిపాలిటీ 4వ వార్డు పరిధిలోని సర్వే నంబర్లు 374, 375లో ఉన్న 22 అడుగుల నక్షా (గొలుసు) రోడ్డుపై ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్బర్జపేట నుంచి రాజ్బొల్లారం గ్రామానికి వెళ్లే ఈ నక్షా రోడ్డు గ్రామానికి అత్యంత కీలకమైన మార్గమని వారు పేర్కొంటున్నారు.
స్థానికుల ఆరోపణల ప్రకారం రోడ్డు స్థలంలో గోడ నిర్మాణం చేపట్టి ఆక్రమణకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయమై గతంలోనే మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, జిల్లా కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also read: మనుషులను బంగారంగా మార్చే శాపం… ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు సినిమా
ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న 22 అడుగుల నక్షా రోడ్డును పరిరక్షించి, వెంటనే సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని గ్రామస్థులు అధికారులను డిమాండ్ చేశారు. ఆలస్యం చేస్తే ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజు, ప్రదీప్ రెడ్డి, సుధాకర్, బాలరాజు, వెంకటేష్, రవి, రాము, వీరేశ్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
Also read: తన శిష్యులకే అవకాశాలు ఇచ్చి, టీమిండియాను నాశనం చేస్తున్నాడు!