Land Encroachment: రూ.10కోట్ల విలువైన భూమిని శ్లొక కన్వర్షన్ యాజమాన్యం కబ్జా
–హైడ్రా కు ఫిర్యాదు చేసిన తెలంగాణ భూముల పరిరక్షణ సమితి
–కబ్జా భూములను పరిశీలించిన హైడ్రా అధికారులు
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్చ: కోట్ల విలువైన భూములను ఎక్కడిక్కడ అందిన కాడికి దోచుకుంటున్న వైనం రంగారెడ్డి జిల్లాలో కనిపిస్తోంది. గత పదేండ్లగా జిల్లాలో రియల్ బడా వ్యాపారులు ప్రభుత్వం భూమి అని తెలిస్తే చాలు ఎలా కబ్జా చేయాలనే ఆలోచనలకు పదును పెడుతున్నారు. ఆనాటి ప్రభుత్వంలో అధికారుల ప్రమేయం లేకుండా అధికార పార్టీ నేతల సహాయంతోనే కబ్జాలకు పాల్పిడినట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి ఆరోపణలపై స్ధానికులు అధికారులకు ఫిర్యాదుల చేసిన ఫలితం లేకుండా పోయింది. అధికారులు సైతం అప్పటి ప్రభుత్వం పెద్దల ఓత్తిడితో తప్పించుకోవాల్సిన దుస్థితి ఉంది.
ఈ ప్రభుత్వంలో ఫిర్యాదులు ఉన్నప్పటికి కూడా కాస్తో కూస్తో విచారణ చేసి నివేధికలైన ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక కబ్జాపై వందల సార్లు ఫిర్యాదులు చేస్తే తప్పా హైడ్రా స్పందించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం కొంత మేలు అనే చర్చ సాగుతుంది. ఎన్నో ధఫాలుగా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని శ్లోక కన్వర్షన్ యాజమాన్యం కబ్జాపై ఫిర్యాదులు చేశారు. దాంతో హైడ్రో స్పందించి క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి విచారణ చేస్తున్నారు.
Also Read: హైదరాబాద్లో ఇంధన కొరత.. రంగంలోకి జిల్లా కలెక్టర్.. కీలక ఆదేశాలు జారీ
రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల సర్కిల్ కొంగర కలాన్ ప్రాంతంలో శ్లోక కన్వెన్షన్ హాల్ యాజమాన్యం ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు. సర్వే నెంబర్ 388,389, 390లల్లో 1348 గజాల ప్రభుత్వ స్థలం అప్పన్నంగా స్వాధినం చేసుకున్నారని తెలంగాణ భూముల పరిరక్షణ సమితి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులైన సైదులు బృందంతో శ్లోక కన్వర్షన్ హాల్ పరిధిలోని ప్రభుత్వ భూమిని పరిశీలిస్తున్నారు. ఈ భూమి విలువ సుమారుగా రూ.10కోట్ల విలువ ఉంటుందని స్ధానికులు వివరిస్తున్నారు.
Also Read: తెలంగాణ నిరుద్యోగులకు మే నెలలో తీపి కబురు..?