E-Paper
Advertisement

లక్షల టన్నుల వరి కుప్పలు.. వాతావరణం మారితే రైతుల పరిస్థితి ఏంటి..?

లక్షల టన్నుల వరి కుప్పలు.. వాతావరణం మారితే రైతుల పరిస్థితి ఏంటి..?
Advertisement

Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: జిల్లాలోని రా రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించి ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని దించుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని రా రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి వారి మిల్లులలో వరి ధాన్యాన్ని దించుకోవడంపై సమీక్షించారు.

గ్రామాల వారీగా..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈసారి రబీ సీజన్లో తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వరిధాన్యం పండిందని వాటిలో దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఇప్పటికే 1లక్షా 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని రేపట్లోగా మరొక 20 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని తెలిపారు. వాతావరణం అనుకూలించి అధికంగా ధాన్యం దిగుబడి వచ్చిందని అన్నారు. గ్రామాల వారీగా రైస్ మిల్లుల వారిగా ధాన్యాన్ని కేటాయిస్తామని జిల్లాలోని రా రైస్ మిల్లర్లు వారి మిల్లులో 40 శాతం కెపాసిటీతో మొత్తం 1లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని సూచించారు.

Advertisement

Also read: బెంగాల్‌లో బీజేపీ సంచలనం.. ఇమామ్‌ల వేతనాలు రద్దు.. దీదీ అవినీతిపై విచారణ!

సన్న రకం వరి..

రానున్న ఖరీఫ్ సీజన్లో జిల్లాలో అధిక శాతం సన్న రకం వరి ధాన్యాన్ని రైతులతో పండించేందుకు ప్రభుత్వ ఆదేశాలు మేరకు రైతులను మోటివేట్ చేస్తున్నామని మిల్లర్లు కూడా రైతులకు సన్న రకం వరి ధాన్యాన్ని పండించడంపై చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ గోపికృష్ణ, రా రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారి జారీ చేయనైనది.

Advertisement

Also read: మెదక్ జిల్లాలో తుది ఓటర్ల జాబితా విడుదల

Related News

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

Big Stories

Advertisement
×