BigTV English
Advertisement

Somesh Kumar : నిబంధనలను తొక్కి పెట్టి.. భార్య పేరుతో 25 ఎకరాలు కొనుగోలు..

Somesh Kumar : నిబంధనలను తొక్కి పెట్టి.. భార్య పేరుతో 25 ఎకరాలు కొనుగోలు..
Somesh Kumar

Somesh Kumar : అందినకాడికి దోచుకోవడం. భూములను కొల్లగొట్టడం. ఆస్తుల కూడబెట్టుకోవడం. ఇదీ బీఆర్ఎస్ పాలనలో ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు సాగించిన దందా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాట అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి బండారం బయటపడింది.


తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సోమేష్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ శివారులో పాతిక ఎకరాల భూములు తన భార్య పేరు మీద కొనుగోలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో సర్వే నెంబర్లు 249, 260లో సుమారు 25 ఎకరాల వ్యవసాయ భూములను సోమేష్ కుమార్ భార్య పేరుతో కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. అయితే.. ఐఎఎస్ అధికారుల నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని DOPTకి చెప్పాల్సి ఉంటుంది. అలా చేయకుండా ఈ సమాచారాన్ని దాచిపెట్టారని సోమేష్ కుమార్‌పై ఆరోపణలు వచ్చాయి.

కేసీఆర్ హయాంలో బిహార్ బ్యాచ్ తెలంగాణను దోచుకున్నది అనేందుకు సోమేష్ కుమార్ వ్యవహారమే ఒక ఉదాహరణ అని విమర్శలు వస్తున్నాయి. ఆయన బాటలో మరికొందరు అధికారులు పయనించారని, నిబంధనలకు విరుద్ధంగా భూ క్రయ విక్రయాలు చేశారని అంటున్నారు. కేసీఆర్ హయాంలో ఉన్నత స్థానాల్లో పనిచేసిన అధికారులపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరపాలని, చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.


Tags

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Big Stories

×