Teenmar Mallanna: ఈశ్వరచారి మృతి విషయంలో బిగ్ టీవీ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక తీన్మార్ మల్లన్న కుల రాజకీయాల రంగు పులిమే ప్రయత్నం చేశారు. ఈశ్వరచారి మృతిపై ఈ రోజు బిగ్ టీవీ ఛానల్కు మల్లన్న ఇంటర్వ్యూ ఇచ్చారు. బీసీ రిజర్వేన్ల కోసమే ఈశ్వరచారి బలిదానం చేసుకున్నారని ఆ ఇంటర్వ్యూలో మల్లన్న స్పష్టం చేశారు. అయితే, మృతుడు ఈశ్వరచారి భార్య కవిత విడుదల చేసిన ఆడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఆర్థిక సాయం చేసిన వీడియోను మల్లన్న వైరల్ చేయటం వల్లే ఈశ్వరచారి మనస్థాపానికి గురయ్యారని కవిత ఆ ఆడియోలో చెప్పారు. ఈ ఆడియో గురించి ఇంటర్వ్యూలో బిగ్టీవీ మల్లన్నను ప్రశ్నించింది.
ఇంటర్వ్యూలో సమాధానం చెప్పలేకనే.. ఇలా..?
ఈ సందర్భంగా బిగ్ టీవీపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు వ్యతిరేకంగా పని చేసే మీడియా సంస్థలలో బిగ్ టీవీ ఒకటి అని వ్యాఖ్యానించారు. బిగ్ టీవీ ఇంటర్వ్యూ తీసుకున్న సందర్భంగా తీన్మార్ మల్లన్న ఈ వ్యాఖ్యలు చేశారు. బిగ్ టీవీ అగ్రవర్ణాలకు సంబంధించిన మీడియా అని అన్నారు.
ప్రశ్నలకు జవాబు చెప్పలేని మల్లన్న వెంటనే బిగ్టీవీపై కుల ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఇంటర్వ్యూ మొదలుపెట్టినప్పుడు మల్లన్నకు లేని అభిప్రాయం, కవిత ఆడియోపై ప్రశ్నించగానే వచ్చిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. నిజంగా బిగ్టీవీ బీసీలకు అన్యాయం చేస్తోందన్న భావన మల్లన్నకు ఉంటే అసలు ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్నలు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. తీన్మార్ మల్లన్న డబుల్ గేమ్ ఆడుతున్నారని జనాలు చర్చించుకుంటున్నారు.
కవిత ఆడియోలో చెప్పిన విషయాలకు సరైన సమాధానం చెప్పుకోలేక మల్లన్న బిగ్టీవీపై నిందలు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బిగ్టీవీ ఏంటో.. దానికి ఉన్న సామాజిక స్పృహ ఏంటో ప్రజలకు తెలుసు.. మల్లన్న సర్టిఫికెట్ బిగ్టీవీకి అక్కర్లేదు. బిగ్టీవీలో అన్ని కులాలు, మతాల వాళ్లు పనిచేస్తున్నారు. ఎప్పుడూ కులాన్ని క్యాష్ చేసుకోవాలని బిగ్టీవీ అనుకోలేదు.. అనుకోదు.