E-Paper
Advertisement

BJP Committees: తెలంగాణ బీజేపీలో పదవుల సందడి.. కమిటీ ఏర్పాటు..!

BJP Committees: తెలంగాణ బీజేపీలో పదవుల సందడి.. కమిటీ ఏర్పాటు..!

BJP Committees: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ బీజేపీలో పదవుల సందడి నెలకొంది. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నేతలు, ఆశావహులందరికీ న్యాయం చేసే దిశగా రాష్ట్ర నాయకత్వం భారీ కమిటీలను ప్రకటించింది. మొదట జంబో కమిటీల ఏర్పాటుకు హైకమాండ్ విముఖత చూపినప్పటికీ, రాష్ట్ర పరిస్థితులు, నేతల ఉత్సాహాన్ని పరిగణనలోకి తీసుకుని చివరకు పచ్చజెండా ఊపింది. పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు ఏకంగా 27 మందిని అధికార ప్రతినిధులుగా నియమించారు. ఇందులో పాత టీం నుంచి ఏడుగురిని కొనసాగించగా, 20 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించడం విశేషం. సామాజిక సమీకరణలు, చురుకైన పనితీరు ప్రాతిపదికన ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది.

అధికారిక బాధ్యతలు

టీవీ చర్చల్లో పార్టీ వాణిని వినిపించేందుకు 13 మందిని మీడియా ప్యానలిస్టులుగా ఎంపిక చేశారు. వీరు వివిధ అంశాలపై పార్టీ వైఖరిని స్పష్టం చేయనున్నారు. వీటితో పాటు, పార్టీకి అనుబంధంగా ఉండే 23 సెల్స్(విభాగాలు)కు కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించారు. ఈ జంబో కమిటీ ద్వారా వీలైనంత ఎక్కువ మంది నేతలకు అధికారిక బాధ్యతలు అప్పగించినట్లు అయ్యింది. అయితే, ప్రస్తుత జాబితాలో చోటు దక్కని వారిని నిరాశపరచకుండా, భవిష్యత్తులో వేయబోయే ఇతర కమిటీల్లో వారికి చోటు కల్పిస్తామని పార్టీ భరోసా ఇచ్చింది. రాబోయే ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకే ఈ భారీ కార్యవర్గాన్ని రంగంలోకి దింపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: Kondigari Ramulu: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు మృతి..!

రాష్ట్ర అధికార ప్రతినిధిగా..

హిందుత్వ వాదం, ప్రధాని మోడీ పాలన నచ్చి బీజేపీలో చేరేందుకు సిద్ధమైన హిందూ ధర్మ రక్ష ఫౌండర్ చికోటి ప్రవీణ్ కు ఆదిలో ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ ఎట్టకేలకు వాటిని అధిగమించి స్టేట్ స్పోక్స్ పర్సన్ల జాబితాలో ప్రవీణ్ చోటు దక్కించుకున్నారు. పార్టీపై తనకున్న నిబద్ధతకు అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించినట్లు ఆయన చెబుతున్నారు. కాగా తనకు బాధ్యతలు అప్పగించడంపై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం అధ్యక్షుడు రాంచందర్ రావును ఆయన కలిశారు. రాంచందర్ రావును శాలువా, బొకేతో సన్మానించారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు చికోటి ప్రవీణ్.., రాంచందర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు పదవి రావడానికి కృషి చేసిన బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారి, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సైతం ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ఎదుగుదలలో తనను భాగస్వామిని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Tourism Vigilance: తెలంగాణ టూరిజంలో విజిలెన్స్ వీక్.. దొరికిందే చాన్స్ అంటూ..!

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×