E-Paper
Advertisement

Telangana Bjp: టచ్‌లో బీఆర్ఎస్ నేతలు.. ఆపై మంతనాలు, రామచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

Telangana Bjp: టచ్‌లో బీఆర్ఎస్ నేతలు.. ఆపై మంతనాలు, రామచందర్‌రావు కీలక వ్యాఖ్యలు
Advertisement

Telangana Bjp: తెలంగాణలో రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఏడాదిన్నరగా బీఆర్ఎస్ సైలెంట్ కావడానికి కారణమేంటి? వెంటాడుతున్న కేసులే కారణమా? ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు మిగతా పార్టీల వైపు చూస్తున్నారా? కారులో కష్టమని డిసైడ్ అయ్యారా? అవుననే అంటున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు.

తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం పోయిన ఏడాదిన్నర పైగానే గడిచింది. కానీ ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఓ వైపు పార్టీలో అంతర్గత సమస్యలు, ఇంకోవైపు వెంటాడుతున్న కేసులతో సతమతమవుతోంది. కనీసం కేడర్ దగ్గరకు వెళ్లే సాహసం చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు పక్క చూపు చూడడం మొదలుపెట్టారు.

Advertisement

తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని మనసులోని మాట బయటపెట్టారు. బీఆర్ఎస్‌తో పాటు కొందరు అధికార పార్టీ నేతలు మా వైపు చూస్తున్నారని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా అవుతున్నట్లు చెప్పుకొచ్చారు.

స్వచ్ఛంధంగా మా పార్టీలోకి వస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయంలో ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ కేసీఆర్ డైరెక్షన్‌లో జరిగిందన్నారు. ఇవాళ అవన్నీ బయటపడుతున్నాయని అన్నారు. అసలు ఫామ్ హౌస్‌లో ఫోన్ ట్యాపింగ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కెమెరాలు పెట్టింది ఎవరు? ఇవన్నీ బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Advertisement

ALSO READ: బీసీ రిజర్వేషన్ల అంశం.. హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా

రామచందర్ రావు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని కొద్దిరోజులు మాత్రమే అయ్యింది. ఈలోగా తెలంగాణలో రాజకీయ పరిణామాలు క్రమంగా మారుతున్నాయి. కేటీఆర్‌పై ఫార్ములా కేసు, కవితపై లిక్కర్ ముడుపుల కేసు, కాళేశ్వరం రిపోర్టు పెద్దాయన-హరీష్‌రావులను వెంటాడుతోంది.  ఈ క్రమంలో నేతలు పక్కచూపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరగనుందో చూడాలి.

 

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×