BigTV English
Advertisement

Telangana Bjp: టచ్‌లో బీఆర్ఎస్ నేతలు.. ఆపై మంతనాలు, రామచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

Telangana Bjp: టచ్‌లో బీఆర్ఎస్ నేతలు.. ఆపై మంతనాలు, రామచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

Telangana Bjp: తెలంగాణలో రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఏడాదిన్నరగా బీఆర్ఎస్ సైలెంట్ కావడానికి కారణమేంటి? వెంటాడుతున్న కేసులే కారణమా? ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు మిగతా పార్టీల వైపు చూస్తున్నారా? కారులో కష్టమని డిసైడ్ అయ్యారా? అవుననే అంటున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు.


తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం పోయిన ఏడాదిన్నర పైగానే గడిచింది. కానీ ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఓ వైపు పార్టీలో అంతర్గత సమస్యలు, ఇంకోవైపు వెంటాడుతున్న కేసులతో సతమతమవుతోంది. కనీసం కేడర్ దగ్గరకు వెళ్లే సాహసం చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు పక్క చూపు చూడడం మొదలుపెట్టారు.

తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని మనసులోని మాట బయటపెట్టారు. బీఆర్ఎస్‌తో పాటు కొందరు అధికార పార్టీ నేతలు మా వైపు చూస్తున్నారని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా అవుతున్నట్లు చెప్పుకొచ్చారు.


స్వచ్ఛంధంగా మా పార్టీలోకి వస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయంలో ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ కేసీఆర్ డైరెక్షన్‌లో జరిగిందన్నారు. ఇవాళ అవన్నీ బయటపడుతున్నాయని అన్నారు. అసలు ఫామ్ హౌస్‌లో ఫోన్ ట్యాపింగ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కెమెరాలు పెట్టింది ఎవరు? ఇవన్నీ బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ALSO READ: బీసీ రిజర్వేషన్ల అంశం.. హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా

రామచందర్ రావు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని కొద్దిరోజులు మాత్రమే అయ్యింది. ఈలోగా తెలంగాణలో రాజకీయ పరిణామాలు క్రమంగా మారుతున్నాయి. కేటీఆర్‌పై ఫార్ములా కేసు, కవితపై లిక్కర్ ముడుపుల కేసు, కాళేశ్వరం రిపోర్టు పెద్దాయన-హరీష్‌రావులను వెంటాడుతోంది.  ఈ క్రమంలో నేతలు పక్కచూపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరగనుందో చూడాలి.

 

Related News

Bhuapalapally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మళ్లీ టోర్నాడో కలకలం.. విరిగిపడ్డ చెట్లు, సమీపంలోని పొలాలు ధ్వంసం!

Telangana: ఎమ్మెల్సీ కవిత.. ఎంత మాటన్నారు.

Hyderabad: నాచారంలో దారుణం.. చట్నీ మీద పడేశాడని వ్యక్తి దారుణ హత్య

Heavy Rain Alert: రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షం.. బయటకు వచ్చారో ముంచేస్తుంది..

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. దిగేసిన పందెం రాయుళ్లు, గెలుపు-మెజార్టీ-సెకండ్ ప్లేస్‌పై ఫోకస్

Jubileehills Bypoll: జూబ్లీహిల్స్ తెరపైకి జనసేన.. టీడీపీ మౌనం కాంగ్రెస్ కి లాభమేనా?

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Say No to Drug: ‘సే నో టు డ్రగ్స్’ పేరుతో రాష్ట్రంలో క్రికెట్ టోర్నమెంట్.. ప్రైజ్ మనీ అక్షరాల రూ.80 లక్షలు

Big Stories

×