BigTV English
Advertisement

Manmohan Singh: భరతమాత ముద్దుబిడ్డను కోల్పోయాం.. మన్మోహన్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి

Manmohan Singh: భరతమాత ముద్దుబిడ్డను కోల్పోయాం.. మన్మోహన్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేసి, మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


మన్మోహన్ సింగ్ మృతి వార్త తెలుసుకున్న సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు వారు ఫోన్ చేసి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ చేసిన సేవలను వారందరూ కొనియాడారు.

మన్మోహన్ మరణంతో గురువు, మార్గదర్శిని కోల్పోయానని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అపారమైన జ్ఞానం, సమగ్రతతో దేశాన్ని ఆయన నడపించారని కొనియాడారు. ఆర్థిక శాస్త్రంలో ఆయనకు ఉన్న లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసించారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ప్రకటించారు.


గొప్ప ఆర్థికవేత్తగానే కాకుండా, గొప్ప మానవతావాదిగా తక్కువ కాలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన మహానేతగా మన్మోహన్ సింగ్ ప్రపంచ స్థాయి పేరుగాంచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సద్గుణం, నిష్కలంకమైన సమగ్రత, ఆర్థికపరమైన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మన్మోహన్ సింగ్ చెరగని ముద్రను వేసుకున్నారని సీఎం కొనియాడారు. రాజకీయ ప్రజా జీవితంలో ఒక లెజెండ్ గా మన్మోహన్ సింగ్ తనదైన ముద్రను వేసుకున్నారని, ప్రధానమంత్రిగా దేశ ఖ్యాతిని ప్రపంచం నలువైపులా చాటి చెప్పిన ఘనత మన్మోహన్ కు దక్కుతుందని సీఎం అన్నారు.

Also Read: Manmohan Singh: ఔను.. మన్మోహన్ సింగ్ ప్రేమలో పడ్డారు.. మీకు తెలుసా!

భరతమాత ఒక గొప్ప బిడ్డను కోల్పోయిందన్న భావన దేశ ప్రజలలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల కనిపిస్తుందన్నారు. మన్మోహన్ సింగ్ విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. దేశం గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, మానవతావాదిని కోల్పోయిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. దేశానికి నిర్విరామ సేవలు అందించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు మన్మోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి, దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అలాగే మన్మోహన్ సింగ్ మృతి వార్త తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Related News

Jubilee Hills By Elections: ఫైనల్‌ స్టేజ్‌కు జూబ్లీహిల్స్‌ బైపోల్‌ క్యాంపెయినింగ్‌.. రేపు సాయంత్రానికి ప్రచారం క్లోజ్‌

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Big Stories

×