E-Paper
Advertisement

PMGDISHA Telangana: డిజిటల్ దిశగా తెలంగాణ.. రాష్ట్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న 12.10 లక్షల మంది లబ్ధిదారులు.

PMGDISHA Telangana: డిజిటల్ దిశగా తెలంగాణ.. రాష్ట్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న 12.10 లక్షల మంది లబ్ధిదారులు.
Advertisement

PMGDISHA Telangana: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్‌ సాక్షరత అభియాన్‌’ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం డిజిటల్‌ సాధికారత దిశగా అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్యులకు సాంకేతికతను చేరువ చేసే లక్ష్యంతో సాగుతున్న ఈ పథకం ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పొందుతున్నారు. ఇటీవలే పార్లమెంట్‌లో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఈ పథకానికి సంబంధించిన గణాంకాలను వెల్లడించారు.

తెలంగాణలో ఇప్పటివరకు 14,56,226 మంది ఈ పథకం కింద తమ పేర్లను నమోదు చేసుకోగా, వారిలో 12,10,448 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ శిక్షణలో మహిళల భాగస్వామ్యం ఆశాజనకంగా ఉంది. మొత్తం 8,90,182 మంది మహిళలు నమోదు చేసుకోగా, వారిలో 7,63,651 మంది డిజిటల్ అక్షరాస్యతను సాధించారు. పురుషుల విషయానికి వస్తే 5,60,022 మంది నమోదు కాగా, 4,46,777 మంది కోర్సును పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందిన లబ్ధిదారులు ఇప్పుడు సొంతంగా ఆన్‌లైన్ సేవలను వినియోగించుకుంటూ, డిజిటల్ లావాదేవీలను సులభంగా నిర్వహించగలుగుతున్నారు.

Advertisement

దేశవ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు 6.39 కోట్ల మందికి ఈ పథకం ద్వారా శిక్షణ అందించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో PMGDISHA కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్ల వాడకం నుంచి ప్రభుత్వ ఈ-సేవలను పొందడం వరకు ఈ శిక్షణ లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడుతోంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో నమోదవుతున్న ఈ పురోగతి, భవిష్యత్తులో పూర్తిస్థాయి డిజిటల్ సమాజ నిర్మాణానికి బలమైన పునాదిగా మారుతోంది.

Read Also: Harish Rao: రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు డెడ్ లైన్, కాంగ్రెస్ శ్రేణులు ఫైర్

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×