E-Paper
Advertisement

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: వరుసగా పండుగలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో నాన్ డ్యూటీ లిక్కర్ జోరందుకుంది. దీనిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.  ఎక్సైజ్‌ అధికారులు ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు.

తాజాగా శంషాబాద్‌లో 125 ప్రీమియం మద్యం బాటిళ్లను సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. అలాగే ముషీరాబాద్‌లో జానీ వాకర్ బాటిల్స్ స్వాధీనం చేశారు. గోవా ప్రాంతాల నుంచి మద్యాన్ని సీక్రెట్ తెచ్చి నగరంలో విక్రయాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో 15 మందికి నోటీసులు ఇచ్చారు. పట్టుకున్న మద్యం విలువ అక్షరాలా రూ. 7.50 లక్షలుగా ఉంటుందని అధికారుల అంచనా.

శంషాబాద్ ప్రధాన రహదారిలో రంగారెడ్డి ఎన్‌ఫోర్సుమెంట్ టీమ్‌తో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. కేవలం గోవా నుంచి కాకుండా ఢిల్లీ, హర్యానా నుంచి మద్యం నగరానికి చేరుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. హెచ్‌డీ‌ఎఫ్‌డీ టీమ్ ముషీరాబాద్‌లోని నరేష్ అనే వ్యక్తి ఇంట్లో ఆరు జానీ వాకర్ మద్యం బాటిళ్లను గుర్తించారు.

ALSO READ: హైదరాబాద్ వాసులకు అలర్ట్..  24 గంటలపాటు ఆ ప్రాంతంలో తాగునీరు బంద్

దీంతో నగరంలోని ప్రధాన ప్రాంతాలపై ఎక్సైజ్ అధికారులు నిఘాను పెంచారు. అలాగే మరోవైపు జోరుగా వాహనాలు తనిఖీలు చేపట్టారు.  ఇదేకాకుండా మారుమూల ప్రాంతాల్లో నాటు సారా జోరందు కున్నట్లు కనిపిస్తోంది. దీని తయారీకి వినియోగించే నల్లబెల్లాన్ని భారీ ఎత్తున సీజ్ చేస్తున్నారు.

హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్‌కు తరలిస్తున్న బెల్లం వాహనాన్ని ఎస్టిఎఫ్ టీమ్స్ పట్టుకున్నాయి. సీజ్ చేసిన వాహనంలో 2010 కేజీల నల్ల బెల్లం, 50 కేజీల ఆలం అందులో ఉంది. డీసీఎం వాహనంతోపాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అశోక్ లేలాండ్ వాహనంతోపాటు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.

పట్టుబడిన బెల్లం విలువ లక్ష రూపాయలుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నాన్ డ్యూటీ లిక్కర్, నాటు సారా వల్ల తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీగా నష్టం వాటిల్లుతుందని అందున్నారు. చేస్తున్న దాడులు దసరా ముగిసేవరకు కొనసాగుతాయని చెబుతున్నారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×