E-Paper
Advertisement

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం
Advertisement

Hyderabad News: వరుసగా పండుగలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో నాన్ డ్యూటీ లిక్కర్ జోరందుకుంది. దీనిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.  ఎక్సైజ్‌ అధికారులు ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు.

తాజాగా శంషాబాద్‌లో 125 ప్రీమియం మద్యం బాటిళ్లను సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. అలాగే ముషీరాబాద్‌లో జానీ వాకర్ బాటిల్స్ స్వాధీనం చేశారు. గోవా ప్రాంతాల నుంచి మద్యాన్ని సీక్రెట్ తెచ్చి నగరంలో విక్రయాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో 15 మందికి నోటీసులు ఇచ్చారు. పట్టుకున్న మద్యం విలువ అక్షరాలా రూ. 7.50 లక్షలుగా ఉంటుందని అధికారుల అంచనా.

Advertisement

శంషాబాద్ ప్రధాన రహదారిలో రంగారెడ్డి ఎన్‌ఫోర్సుమెంట్ టీమ్‌తో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. కేవలం గోవా నుంచి కాకుండా ఢిల్లీ, హర్యానా నుంచి మద్యం నగరానికి చేరుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. హెచ్‌డీ‌ఎఫ్‌డీ టీమ్ ముషీరాబాద్‌లోని నరేష్ అనే వ్యక్తి ఇంట్లో ఆరు జానీ వాకర్ మద్యం బాటిళ్లను గుర్తించారు.

ALSO READ: హైదరాబాద్ వాసులకు అలర్ట్..  24 గంటలపాటు ఆ ప్రాంతంలో తాగునీరు బంద్

Advertisement

దీంతో నగరంలోని ప్రధాన ప్రాంతాలపై ఎక్సైజ్ అధికారులు నిఘాను పెంచారు. అలాగే మరోవైపు జోరుగా వాహనాలు తనిఖీలు చేపట్టారు.  ఇదేకాకుండా మారుమూల ప్రాంతాల్లో నాటు సారా జోరందు కున్నట్లు కనిపిస్తోంది. దీని తయారీకి వినియోగించే నల్లబెల్లాన్ని భారీ ఎత్తున సీజ్ చేస్తున్నారు.

హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్‌కు తరలిస్తున్న బెల్లం వాహనాన్ని ఎస్టిఎఫ్ టీమ్స్ పట్టుకున్నాయి. సీజ్ చేసిన వాహనంలో 2010 కేజీల నల్ల బెల్లం, 50 కేజీల ఆలం అందులో ఉంది. డీసీఎం వాహనంతోపాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అశోక్ లేలాండ్ వాహనంతోపాటు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.

పట్టుబడిన బెల్లం విలువ లక్ష రూపాయలుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నాన్ డ్యూటీ లిక్కర్, నాటు సారా వల్ల తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీగా నష్టం వాటిల్లుతుందని అందున్నారు. చేస్తున్న దాడులు దసరా ముగిసేవరకు కొనసాగుతాయని చెబుతున్నారు.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×