BigTV English
Advertisement

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Hyderabad News: ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. సాయంత్రం అయితే చాలు ఏ ప్రాంతంలో వర్షం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు నగరవాసులకు మరో షాక్ ఇచ్చింది.


భాగ్యనగరంలో పలు ప్రాంతాలకు సెప్టెంబర్ 24న అంటే బుధవారం మంజీరా తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై విభాగం చేపట్టిన మరమ్మత్తు పనుల కారణంగా అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు అధికారులు. ప్రధానంగా మంజీరా ఫేజ్-2 ప్రాజెక్టులో కాలాబ్‌గూర్ నుంచి హైదర్‌‌నగర్ వరకు పంపింగ్ మెయిన్‌లో భారీగా లీకులు ఏర్పడ్డాయి.

వాటిని అరికట్టేందుకు బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మరమ్మత్తులు జరగనున్నాయి. దీని కారణంగా ఆయా ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. హైదరాబాద్ వాటర్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.


మంజీరా నీటి సరఫరా వ్యవస్థకు కీలకమైంది ఈ ప్రాజెక్టు. కొంతకాలంగా ఈ మార్గంలో అనేక లీకులు మొదలయ్యాయి. ఫలితంగా వేలాది లీటర్ల నీరుగా వృథా పోతోంది.కేవలం వేసవి కాలంలో కాకుండా,వర్షాకాలంలో ఆయా లీకుల వల్ల నీటి సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి.

ALSO READ: సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు ముందు జాగ్రత్తగా నీటిని నిల్వ చేసుకోవాలని హైదరాబాద్ వాటర్ బోర్డు సూచన చేసింది.  పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగర వాసులు ఈ సమస్యను అర్థం చేసుకొని సహకరించాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేసింది.

కావున ఈ 24 గంట‌లు కింద పేర్కొన్న కొన్ని ప్రాంతాల్లో లో ప్రెజ‌ర్ తో నీటిస‌ర‌ఫ‌రా, మ‌రికొన్ని ప్రాంతాల్లో స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం కలుగుతుంది.  తాగునీటి అంత‌రాయం ఏర్ప‌డే ప్రాంతాలు: ఓ అండ్ ఎం డివిజ‌న్-17లోని ఆర్సీ పురం, అశోక్ న‌గ‌ర్, జ్యోతి న‌గ‌ర్, లింగంప‌ల్లి, చందాన‌గ‌ర్, గంగారం, మదీనాగూడ‌, మియాపూర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.

అలాగే ఓ అండ్ ఎం డివిజ‌న్-22లో బీరంగూడ‌, అమీన్‌పూర్ ఉన్నాయి. ట్రాన్స్ మిష‌న్ డివిజ‌న్-2లో ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ క‌నెక్ష‌న్లు ఉన్నాయి. ఓ అండ్ ఎం డివిజ‌న్-6లో ఎర్ర‌గ‌డ్డ‌, ఎస్‌ఆర్ న‌గ‌ర్, అమీర్ పేట్ ఉండగా, ఓ అండ్ ఎం డివిజ‌న్ 9లో కేపీహెచ్ బీ కాల‌నీ, కూక‌ట్‌ప‌ల్లి, భాగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్ వంటివి ఉన్నాయి. పైన పేర్కొన్న ప్రాంతాల్లో నీటిని పొదుపుగా వాడుకుంటారని వినియోగ‌దారులను అధికారులు కోరారు.

 

 

Related News

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Big Stories

×