Hyderabad News: ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. సాయంత్రం అయితే చాలు ఏ ప్రాంతంలో వర్షం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు నగరవాసులకు మరో షాక్ ఇచ్చింది.
భాగ్యనగరంలో పలు ప్రాంతాలకు సెప్టెంబర్ 24న అంటే బుధవారం మంజీరా తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై విభాగం చేపట్టిన మరమ్మత్తు పనుల కారణంగా అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు అధికారులు. ప్రధానంగా మంజీరా ఫేజ్-2 ప్రాజెక్టులో కాలాబ్గూర్ నుంచి హైదర్నగర్ వరకు పంపింగ్ మెయిన్లో భారీగా లీకులు ఏర్పడ్డాయి.
వాటిని అరికట్టేందుకు బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మరమ్మత్తులు జరగనున్నాయి. దీని కారణంగా ఆయా ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. హైదరాబాద్ వాటర్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.
మంజీరా నీటి సరఫరా వ్యవస్థకు కీలకమైంది ఈ ప్రాజెక్టు. కొంతకాలంగా ఈ మార్గంలో అనేక లీకులు మొదలయ్యాయి. ఫలితంగా వేలాది లీటర్ల నీరుగా వృథా పోతోంది.కేవలం వేసవి కాలంలో కాకుండా,వర్షాకాలంలో ఆయా లీకుల వల్ల నీటి సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి.
ALSO READ: సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన
ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు ముందు జాగ్రత్తగా నీటిని నిల్వ చేసుకోవాలని హైదరాబాద్ వాటర్ బోర్డు సూచన చేసింది. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగర వాసులు ఈ సమస్యను అర్థం చేసుకొని సహకరించాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేసింది.
కావున ఈ 24 గంటలు కింద పేర్కొన్న కొన్ని ప్రాంతాల్లో లో ప్రెజర్ తో నీటిసరఫరా, మరికొన్ని ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం కలుగుతుంది. తాగునీటి అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: ఓ అండ్ ఎం డివిజన్-17లోని ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.
అలాగే ఓ అండ్ ఎం డివిజన్-22లో బీరంగూడ, అమీన్పూర్ ఉన్నాయి. ట్రాన్స్ మిషన్ డివిజన్-2లో ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లు ఉన్నాయి. ఓ అండ్ ఎం డివిజన్-6లో ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్ ఉండగా, ఓ అండ్ ఎం డివిజన్ 9లో కేపీహెచ్ బీ కాలనీ, కూకట్పల్లి, భాగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్ వంటివి ఉన్నాయి. పైన పేర్కొన్న ప్రాంతాల్లో నీటిని పొదుపుగా వాడుకుంటారని వినియోగదారులను అధికారులు కోరారు.
తాగునీటి సరఫరాలో అంతరాయం
======================హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్-2 లో కలబ్ గూర్ నుంచి హైదర్ నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ లీకేజీలను అరికట్టేందుకు… pic.twitter.com/08BV3F6gWm
— HMWSSB (@HMWSSBOnline) September 23, 2025