E-Paper
Advertisement

Kodandareddy Nashik visit: నాసిక్‌లో తెలంగాణ రైతు కమిషన్ రెండో రోజు పర్యటన..సహ్యాద్రి ఫార్మ్స్ ఎండీతో కీలక భేటీ

Kodandareddy Nashik visit: నాసిక్‌లో తెలంగాణ రైతు కమిషన్ రెండో రోజు పర్యటన..సహ్యాద్రి ఫార్మ్స్ ఎండీతో కీలక భేటీ

Kodandareddy Nashik visit:  తెలంగాణ రైతు కమిషన్ బృందం నాసిక్ లో రెండో రోజు పర్యటన కొనసాగించింది. పలు వ్యవసాయ క్షేత్రాలను విజిట్ చేసి.. అక్కడి రైతులతో నేరుగా మాట్లాడి పంటల సాగు విధానం, సాగుకయ్యే ఖర్చు, మార్కెటింగ్, లాభనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇక సహ్యాద్రి ఎండీ విలాస్ షిండే తో కమిషన్ బృందం సాయంత్రం భేటీ అయ్యింది. రెండు రోజులుగా నాసిక్ ప్రాంతంలో పర్యటిస్తున్న కమిషన్ బృందానికి విలాస్ షిండే స్వాగతం పలికారు. సహ్యాద్రి క్యాంపస్ లో దాదాపు 2 గంటల పాటు పలు అంశాలపై చర్చించారు. దక్షిణ భారత్ దేశంలో ప్రధానంగా తెలంగాణ లాంటి రాష్ట్రానికి సహ్యాద్రి ఫార్మ్స్ సహకారం కలవాలని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోరారు.

తెలంగాణలో గోదావరి, కృష్ణ నదులతోపాటు గొలుసుకట్టు చెరువులు ఉన్నాయని, అన్ని రకాల పంటల సాగుకు సారవంతమైన భూమి ఉందని..  వాతావరణం సైతం అనుకూలంగా ఉంటుందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. రైతు బిడ్డా అని, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాలను విలాస్ షిండే కు కోదండరెడ్డి వివరించారు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్.. విజన్ -2047లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చిన విషయం సైతం గుర్తుచేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని తెలిపారు. ఆ దిశగానే సీఎం ప్రస్తుతం దావోస్ లో వున్నారని వివరించారు. సీఎం ఆదేశాల మేరకు కమిషన్ బృందం ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తుందని తెలిపారు. బలమైన FPO లు ఏర్పాటు కావాలని దానికోసం మీలాంటి వారు తెలంగాణకు రావాలని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి.. సహ్యాద్రి ఎండీ విలాస్ షిండే ను రిక్వెస్ట్ చేశారు.

కోదండరెడ్డి ఆహ్వానం మేరకు సహ్యాద్రి ఎండీ విలాస్ షిండే సానుకూలంగా స్పందించారు. కమిషన్ సభ్యులు రాములు నాయక్, కేవీఎన్ రెడ్డిలు మాట్లాడుతూ.. దేశంలో పంజాబ్ తర్వాత తెలంగాణలోనే రైతు సంక్షేమ కమిషన్ ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయంపై మక్కువతో కమిషన్ ఏర్పాటు చేశారని, వ్యవసాయంపై అనుభవం వున్న చైర్మన్ కోదండరెడ్డి ఉండడం కూడా రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.

ములుగు, గద్వాల్ జిల్లాలో విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన రైతులకు కమిషన్ చొరవ తీసుకొని కంపెనీల నుండి నష్టపరిహారం ఇప్పించినట్లు వివరించారు. రాంరెడ్డి గోపాల్ రెడ్డి , భవానీ రెడ్డిలు సైతం పలు అంశాలపై షిండే డిస్కస్ చేశారు. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, మార్కెటింగ్ విధానం, పెట్టుబడి, మూసధోరణిలో సాగు, పంటల మార్పిడి పై చర్చించారు. కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలో సాగిన పర్యటనలో కమిషన్ సభ్యులు రాములు నాయక్, కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, మెంబర్ సెక్రెటరీ గోపాల్, కమిషన్ అధికారులు సంధ్యారాణి, హరి, స్రవంతి, రజిత, FPO లు ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.

ALSO READ:జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వాసులకు ఊరట.. రంగంలోకి దిగిన జలమండలి బాస్

Related News

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

Big Stories

×