News Flyovers: హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో నగర వాసుల ట్రాఫిక్ కష్టాల నుంచి మరింత ఉపశమనం కలగనుంది. నగరరంలోని ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే రహదారులను ఆదునీకరించే హెచ్-సిటీ ప్రాజెక్టు పనులలో భాగంగా మరో రూ. 940 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్లో మరో రెండు కొత్త ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్లోని ప్రయాణికులకు మేలు కలగనుంది.
నగరంలోని నాగార్జున సాగర్ రహదారి వద్ద ఉన్నటువంటి ప్రధానమైన మూడు జంక్షన్లను కలుపుతూ ప్రభుత్వం సిగ్నల్ రహిత ప్రయాణం అందిచాలని అనుకుంటుంది. అందుకోసం ఓ భారీ ఫ్లైఓవర్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఫ్లైఓవర్ పూర్తి అయితే.. హైదరాబాద్ ప్రాంతంలోనికి ప్రవేశించే, తిరిగి వెల్లే వేలాది వాహనాకులకు సమయం, పెట్రోల్, ట్రాఫిక్ సమస్యలనుండి తప్పించ వచ్చని ప్రభుత్వం అనుకుంటుంది. అందుకోసం ప్రభుత్వం నాగార్జు సాగర్ రోడ్డుపై రూ.670 కోట్లతో భారీ పోడవైన మరో ఫ్లైఓవర్ని నిర్మించాలని నిర్ణయించింది.
Also Read: కర్నూలు కలెక్టరేట్ ఆఫీస్లో తీవ్ర ఉద్రిక్తత.. మహిళ మృతదేహంతో బంధువుల ధర్నా!
నేటికి నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్న ఆనంద్ నగర్ జంక్షన్ వద్ద 4-లైన్ల ఓ భారీ ఫ్లైఓవర్ని నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. రెండు వైపులా కలిపి మోత్తం నాలుగు లైన్ల ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకురావాలని దీనికోసం ఓ కొత్త ఫ్లైఓవర్ ని నిర్మించాలని ప్రభుత్వం పేర్కోంది. దీనిసం రూ.270 కోట్ల వ్యయంను సర్కార్ ఖర్చు చేయనుంది. దీంతో నగరంలో ప్రాంతీయ కనెక్టివిటీకి మేలు కలుగుతుందని ప్రభుత్వం పేర్కోంది.
Also Read: మోదీ వీడియో డిలీట్ వివాదం.. దెబ్బకు దిగొచ్చిన మెటా.. కేంద్రానికి జుకర్బర్గ్ సారీ!