E-Paper
Advertisement

దశాబ్ధాల భూ పంచాయతీలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!

దశాబ్ధాల భూ పంచాయతీలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!
Advertisement

Land Survey: స్వేచ్ఛ బ్యూరో: దశాబ్దాలుగా పరిష్కారం కానీ భూ వివాదాలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం సరిహద్దులు తెలియక, రికార్డులు ట్యా లీ కాకపోవడం తో వేల ఎకరాల భూమి ‘పంచాయతీ’ల్లో నలుగుతోంది. దీనివల్ల అటు ప్రభుత్వానికి, ఇటు సామాన్య రైతులకు తీరని నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, వివాదాస్పద భూములపై ఉమ్మడి సర్వే నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఒకే భూమిపై రెండు వేర్వేరు శాఖలు తమ హక్కులు కోరుతున్నాయి. ఈ సమన్వయ లోపం వల్ల వేలాది ఎకరాలు వినియోగంలో లేకుండా పోతున్నాయి.

ప్రధానంగా..

రెవెన్యూ వర్సెస్ ఫారెస్ట్ శాఖ ల మధ్య సరిహద్దు పంచాయతీలు నెలకొంటున్నాయి.అటవీ సరిహద్దు గ్రామాల వద్ద భూమి ఎవరిదో తెలియక ఏళ్ల తరబడి కేసులు నడుస్తున్నాయి. అంతేగాక ఆలయ భూముల గుర్తింపులో స్పష్టత కరువవ్వడం, వక్ఫ్ ఆస్తుల రికార్డులు, రెవెన్యూ రికార్డులతో సరిపోలకపోవడం వంటి సమస్యలు ఏళ్ల తరబడి నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే​ఈ భూ చిక్కులను విప్పేందుకు ప్రభుత్వం అన్ని శాఖల అధికారులతో కూడిన ఒక స్పెషల్ కమిటీని సర్కార్ ఏర్పాటు చేస్తోంది.

Advertisement

Also Read: కవిత‌కు ఎన్నికల సంఘం షాక్.. ఆపై పార్టీ పేరు మార్పు, ఈసీ గ్రీన్ సిగ్నల్

ఈ కమిటీ ఆధ్వర్యంలో..

​సమగ్ర క్షేత్రస్థాయి విచారణ జరుగుతుంది.​డిజిటల్ సర్వే పరికరాల సహాయంతో సరిహద్దులను ఖరారు చేస్తారు. శాఖల మధ్య ఉన్న గందరగోళాన్ని తొలగించి, ‘ఉమ్మడి సరిహద్దు నివేదిక’ను రూపొందిస్తారు. ఈ సర్వే వల్ల రైతులకు భూ హక్కులపై స్పష్టత వస్తుంది, క్రయవిక్రయాల్లో ఇబ్బందులు తొలగుతాయి. ప్రభుత్వానికి విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవచ్చు. అభివృద్ధికి వివాదాలు లేని భూములను పరిశ్రమలకు లేదా ప్రజా అవసరాలకు కేటాయించవచ్చు. న్యాయస్థానాలకు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వేలాది భూ వివాద కేసులు పరిష్కారమవుతాయి.

శాశ్వత పరిష్కారం దిశగా..

Advertisement

​గతంలో అడపాదడపా సర్వేలు చేసినా, అవి కేవలం ఒక్కో శాఖ విడివిడిగా చేయడం వల్ల ఫలితం లేకపోయింది. ఇప్పుడు “ఉమ్మడి సర్వే” విధానం ద్వారా ఒకేసారి అందరి సమక్షంలో సరిహద్దులు నిర్ణయించడం వల్ల భవిష్యత్తులో మళ్లీ వివాదాలు తలెత్తే అవకాశం ఉండదు.​ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం క్షేత్రస్థాయిలో సక్సెస్ అయితే, రాష్ట్రంలో భూ పరిపాలనలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. దశాబ్దాల ‘భూ పంచాయతీ’లకు శాశ్వత విముక్తి లభిస్తుంది.

Also Read: రైతు రుణమాఫీపై హైకోర్టుకు హరీశ్ రావు.. ధర్మాసనం సంచలన ఆదేశాలు

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×