E-Paper
Advertisement

Paddy Bonus: రైతులకు వరం.. సన్న వడ్ల బోనస్ బకాయిలు రిలీజ్.. రూ.514 కోట్ల నిధులు విడుదల

Paddy Bonus: రైతులకు వరం.. సన్న వడ్ల బోనస్ బకాయిలు రిలీజ్.. రూ.514 కోట్ల నిధులు విడుదల
Advertisement

తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఖరీఫ్ సీజన్‌లో సన్న వడ్లు పండించిన రైతులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బోనస్ నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రూ. 514.36 కోట్ల భారీ నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్వింటాలుకు రూ. 500 చొప్పున ఈ బోనస్ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్’ (DBT) పద్ధతిలో జమ చేయనున్నారు.

2.17 లక్షల మంది రైతులకు లబ్ధి

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.17 లక్షల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. గత కొంతకాలంగా బోనస్ బకాయిల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ నిధుల విడుదల పెద్ద ఊరటనిచ్చింది. ఈ దఫా విడుదల చేసిన నిధులతో కలిపి, ఇప్పటివరకు ప్రభుత్వం రైతులకు చెల్లించిన మొత్తం బోనస్ విలువ రూ. 1,939.58 కోట్లకు చేరుకుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అదనపు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది.

సన్న రకాల సాగుకు ప్రోత్సాహం

Advertisement

తెలంగాణలో సన్న బియ్యం సాగును భారీగా పెంచాలనే సంకల్పంతో ప్రభుత్వం కనీస మద్దతు ధర (MSP) కంటే అదనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ ప్రకటిచింది. సాధారణ రకాల కంటే సన్న రకాలకు మార్కెట్‌లో డిమాండ్ ఉన్నప్పటికీ పెట్టుబడి ఖర్చు దృష్ట్యా రైతులు వెనకడుగు వేయకుండా ఈ ప్రోత్సాహకం తోడ్పడుతోంది. ప్రభుత్వ లక్ష్యం కేవలం గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన సన్న బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం కూడా అని అధికారులు వెల్లడించారు.

బకాయిలు క్లియర్.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి

తాజా నిధుల విడుదలతో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బోనస్ బకాయిలు దాదాపు పూర్తిగా క్లియర్ అయ్యాయని సివిల్ సప్లైస్ శాఖ తెలిపింది. రైతులు తమ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకోవాలని.. ఒకవేళ నిధులు జమ కావడంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే వెంటనే సంబంధిత ధాన్యం కొనుగోలు కేంద్రాలను (PPC) లేదా జిల్లా సివిల్ సప్లైస్ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.

రైతు సంక్షేమమే ధ్యేయం

Advertisement

ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు రైతులకు సకాలంలో చెల్లింపులు జరపడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అదనపు బోనస్ నిధుల విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇటువంటి చర్యలు దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ALSO READ: Telangana Municipal: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. ఈ 11 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×