E-Paper
Advertisement

Telangana Group-3 Results: గ్రూప్-3 ఫలితాలు విడుదల.. కటాఫ్ ఎలా ఉందంటే..

Telangana Group-3 Results: గ్రూప్-3 ఫలితాలు విడుదల.. కటాఫ్ ఎలా ఉందంటే..

Telangana Group-3 Results: తెలంగాణలో గ్రూప్-3 రాత పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. ఈ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభ్యర్థులకు ఇప్పుడు ఊరట లభించింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో జనరల్ ర్యాంకింగ్ జాబితాను కూడా విడుదల చేశారు. మీ ఫలితాలను తెలుసుకునేందుకు ఇక్కడ వెబ్ లింక్ క్లిక్ చేయండి. (https://www.tspsc.gov.in/notificationPDF/G3PFIN_220452GRL/GR3_2922_GRL_FOR_DISPLAY_12032025.pdf) . ఆ తర్వాత మీకు పీడీఎఫ్ రూపంలో జాబితా కనిపిస్తుంది. అందులో మీ హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా మీ మార్కులు, ర్యాంకు వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

గ్రూప్-3 పరీక్షకు విశేష స్పందన
తెలంగాణలో గ్రూప్-3 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 30 న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1365 ఖాళీలకు పరీక్ష నిర్వహించారు. ఈ నోటిఫికేషన్‌కు అద్భుతమైన స్పందన లభించింది. మొత్తం 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల శాతం 50.24% మాత్రమే. అభ్యర్థులంతా తమ సర్వశక్తులను ఉపయోగించి పరీక్ష రాసినప్పటికీ, చివరకు కష్టపడినవారికే విజయ ఫలితాలు దక్కాయి.

కటాఫ్ వివరాలు
ఈసారి గ్రూప్-3 రాత పరీక్ష కటాఫ్ మార్కులు కొంచెం ఎక్కువగానే నమోదయ్యాయి. ప్రశ్నపత్రం కొంత క్లిష్టంగా ఉండటంతో మెరిట్ స్థాయిలో కటాఫ్ మార్కులు పెరిగినట్లు తెలుస్తోంది. జనరల్ కేటగిరీ అభ్యర్థుల కోసం కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ అభ్యర్థులకు తక్కువ కటాఫ్ మార్కులతో అవకాశం కల్పించారు.

కటాఫ్ వివరాలు (అంచనా):

  • జనరల్ – 70%
  • బీసీ – 65%
  • ఎస్సీ – 60%
  • ఎస్టీ – 58%
  • పీహెచ్ – 55%

Read Also: Business Idea: సున్నా పెట్టుబడి, ఒకేచోట కూర్చుని చేసే బిజినెస్

పోస్టుల భర్తీ వివరాలు
గ్రూప్-3 పరీక్ష ద్వారా 1365 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 107 శాఖల్లో వివిధ పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో అత్యధిక పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

నియమించనున్న పోస్టులు:

  • అకౌంటెంట్
  • జూనియర్ అకౌంటెంట్
  • సీనియర్ అకౌంటెంట్
  • జూనియర్ అసిస్టెంట్
  • సీనియర్ అసిస్టెంట్
  • సీనియర్ ఆడిటర్

అభ్యర్థులకు సూచనలు

పరీక్ష పకడ్బందీగా, అక్రమ చర్యలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ప్రశ్నపత్రం కాస్త క్లిష్టంగా ఉండటంతో మెరిట్ లెవెల్ పెరిగినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థులు తమ ర్యాంక్‌ను జాబితాలో చూసుకున్న తరువాత, ఎంపిక ప్రక్రియ కోసం సిద్ధంగా ఉండాలి. ఎంపికైన వారి లిస్ట్ త్వరలో రానుంది. ఈ క్రమంలో అభ్యర్థులు తమ ర్యాంక్‌ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు సిద్ధం కావాలి. అవసరమైన ధృవపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఈ క్రమంలో ఎంపిక ప్రక్రియ గురించి ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేస్తుండాలి.

Tags

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×