E-Paper
Advertisement

High Court on Bandi Sanjay: బండి సంజయ్ పై హైకోర్టు ఆగ్రహం.. ఎందుకంటే..?

High Court on Bandi Sanjay:  బండి సంజయ్ పై హైకోర్టు ఆగ్రహం.. ఎందుకంటే..?
Advertisement
High Court on Bandi Sanjay

Bandi Sanjay latest news(Political news today telangana):

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరీంనగర్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గంగుల కమలాకర్‌ ఎన్నిక వివాదం హైకోర్టులో ఉంది. ఈ కేసుపై విచారణ జరుగుతోంది. తాజాగా హైకోర్టులో జరిగిన క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు బండి సంజయ్‌ హాజరుకాలేదు. ఆయన కోర్టుకు రాకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే పలుమార్లు క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు బండి సంజయ్‌ తరఫు న్యాయవాది గడువు కోరారు.

ప్రస్తుతం బండి సంజయ్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి గడువు ఇవ్వాలని హైకోర్టుకు బండి సంజయ్ తరఫున న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో బండి సంజయ్ తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

ఎన్నికల పిటిషన్లు 6 నెలల్లో తేల్చాల్సి ఉంటుంది. అందుకే విచారణ ముగిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 12న బండి సంజయ్‌ హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సంజయ్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు హాజరవ్వాలంటే సైనిక సంక్షేమ నిధికి రూ. 50 వేలు చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×