E-Paper
Advertisement

వేసవిలోనే పూడికతీత పనులు పూర్తి చేయాలి.. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

వేసవిలోనే పూడికతీత పనులు పూర్తి చేయాలి.. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
Advertisement

Uttam Kumar Reddy irrigation review: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చెరువుల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ కమిటీల్లో కేవలం అధికారులు మాత్రమే కాకుండా రైతులు, స్థానిక భాగస్వాములు సభ్యులుగా ఉంటారు. క్షేత్రస్థాయిలో చెరువుల పరిస్థితిని పర్యవేక్షించడం, అభివృద్ధి పనులను సమన్వయం చేయడం ఈ కమిటీల ప్రధాన బాధ్యత. ఈ వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ చెరువుల్లో పూడికతీత పనులను అత్యవసర ప్రాధాన్యతగా చేపట్టాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే అన్ని చెరువుల్లో పనులు మొదలుపెట్టి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

Advertisement

చెరువుల ప్రస్తుత పరిస్థితి, వాటి పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలపై రైతు కమిషన్ అందించిన సమగ్ర నివేదికను మంత్రి అభినందించారు. కమిషన్ చేసిన ప్రతిపాదనలు ఆచరణాత్మకంగా ఉన్నాయని పేర్కొన్న ఆయన.. వీటిని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులను కేటాయించేలా చూస్తానని భరోసా ఇచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న చెరువులను బాగు చేయడం ద్వారా సాగునీటి కష్టాలు తీరడంతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: త్వరలో కొత్త పథకాల అమలుకు శ్రీకారం: మంత్రి కోమటి రెడ్డి..!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×