Mee Seva: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కొత్త రుసుములు అమల్లోకి వచ్చాయి. ఇక పై మీ సేవ సేవలకు కొత్త రేట్లు పాత చార్జీలతో పోల్చవద్దని మీ సేవా అధికారులు పేర్కోన్నారు. దీనకి రాష్ట్రంలొని ప్రజలందరు సహకరించాలని అధికారులు పేర్కొన్నారు. కొత్త చార్జీలకు వినియోగదారులు సహకరించాలని జిల్లా మీసేవ అధ్యక్షులు, కార్యదర్శుల విజ్ఞప్తిచేశారు.
రాష్ట్రలోని ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి మీ సేవ సేవలపై కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి. దీంతో గతంలో కంటే ప్రస్తుతం సేవల రుసుముల్లో మార్పులు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. దీంతో వినియోగదారులు పాత చార్జీలతో పోల్చి సందేహాలు వ్యక్తం చేయకుండా, ప్రభుత్వం నిర్ణయించిన తాజా రుసుములను చెల్లించి సహకరించాలని జిల్లా మీసేవ అధ్యక్షులు సితారే క్షేవిన్ (రాజ్) విజ్ఞప్తి చేసారు.
Also Read: కొత్త చట్టంతో.. సంబరాలు చేసుకుంటున్న మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ సభ్యులు
వినియోగదారులు మేము నిన్నే అప్లై చేసాం, అంత ఛార్జ్ లేదు.. మా ఫ్రెండ్స్, బంధువులు తక్కువ చెల్లించారు. వంటి అపోహలు పెట్టుకోకుండా, ప్రభుత్వం తాజా చార్జీలను గమనించి మీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఇన్నేళ్లుగా పెంపు లేకుండా ఉన్న మీసేవ సేవల చార్జీలను పెంచినందుకు, రాష్ట్ర ప్రభుత్వానికి మీ సేవ కేంద్రాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ప్రభుత్వానికి మీ సేవా అధికారులు తెలిపారు.
Also Read: Fuel Hike: వాహనదారులకు షాక్.. భారీగా పెరిగిన ప్రీమియం పెట్రోల్.. లీటర్పై ఎంతంటే?