E-Paper
Advertisement

Telangana Men Rescued: రష్యా ఆర్మీ చెర నుంచి బయటకు తెలంగాణ వ్యక్తి.. దాదాపు ఎనిమిది నెలల తర్వాత..

Telangana Men Rescued: రష్యా ఆర్మీ చెర నుంచి బయటకు తెలంగాణ వ్యక్తి.. దాదాపు ఎనిమిది నెలల తర్వాత..
Advertisement

Telangana Men Rescued: ఉద్యోగం కోసం రష్యా వెళ్లాడు తెలంగాణకు చెందిన ఓ యువకుడు. అక్కడికి వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసింది. తాను ఏజెంట్ల చేతిలో మోసపోయానని తెలుసు కున్నాడు. అక్కడి నుంచి బయట పడలేకపోయాడు. అదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్ భీకరంగా జరుగుతోంది. ఇండియా నుంచి వెళ్లినవారిని సైనికులుగా ఉపయోగించుకుంది. వారిలో తెలంగాణకు చెందిన సోఫియాన్ కూడా ఒకడు. చివరకు ఇరుదేశాల దౌత్యం కారణంగా బయటపడ్డాడు. ఎనిమిది నెలల తర్వాత పేరెంట్స్ చూసిన ఆనందంలో కంటతడి పెట్టాడు.

సోఫియాన్.. వయస్సు 24 ఏళ్లు. సొంతూరు నారాయణ్‌పేట్. ఉద్యోగం నిమిత్తం ఏజెంట్ ద్వారా రష్యాకు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మోసపోయానని తెలుసుకున్నాడు. ఆయనతోపాటు చాలామంది మోసపోయారు.

Advertisement

రష్యా లాంగ్వేజ్‌లో అగ్రిమెంట్ పేపర్స్‌పై సంతకాలు చేయించి అక్కడి సైన్యంలో చేర్పించాడు ఏజెంట్. వారిని రష్యా ఆర్మీ తమ వద్ద పెట్టుకుంది. వారిలో సోఫియాన్ ఉన్నాడు. వారికి ట్రైనింగ్ ఇచ్చి బోర్డర్‌లో కాపలా పెట్టింది.  అప్పటికే హైదరాబాద్‌కి చెందిన ఓ యువకుడు చనిపోవడంతో.. సోఫియాన్ కుటుంబంలో ఆందోళన మొదలైంది.

తమకు కొడుకును ఇండియాకు రప్పించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. అదే సమయంలో రష్యా ఆర్మీ తమను బంధించి ఉక్రెయిన్ బోర్డర్‌లో కాపాల పెట్టిందని, ఆరు నెలల కిందట వీడియోలు పేరెంట్స్ పంపాడు. దీంతో సోఫియాన్ కుటుంబ సభ్యుల్లో భయం రెట్టింపు అయ్యింది.

Advertisement

ALSO READ: హైడ్రా రద్దు చేయాలని పిటిషన్.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

భారత్-రష్యాల ఒప్పందంలో భాగంగా  ఐదుగురు భారతీయులను విడుదల చేశారు. వారిలో సోఫియాన్ కూడా ఉన్నాడు. రెండు రోజుల కిందట ఇండియాకు చేరుకున్న ఆ యువకుడు, శుక్రవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగారు. దీంతో సోఫియాన్ చూసి ఒక్కసారిగా ఆ ఫ్యామిలీ కన్నీటి పర్యంతమైంది. శంషాబాద్ నుంచి బస్సులో నారాయణపేట్‌కు చేరుకున్నాడు. కొడుకు క్షేమంగా రావడంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.  మరో 70 మంది భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు.

 

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×