E-Paper
Advertisement

Telangana Phone tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ అరెస్ట్..

Telangana Phone tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ అరెస్ట్..
Advertisement
Phone tapping case
Phone tapping case

Telangana Phone tapping case Updates(Breaking news in telangana): తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, గట్టు మల్లు అరెస్ట్ అయ్యారు. వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాధాకిషన్ రావు, గట్టు మల్లును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గతంలో గట్టు మల్లు ఎస్ఐబీ సీఐగా విధులు నిర్వహించారు. ఆ సమయంలోనే ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.

Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ప్రధాన సూత్రధారిగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేశారు. అలాగే అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: ఫోన్‌ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు..

Advertisement

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టారని తెలుస్తోంది. వారి ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను ధ్వంసం చేశారని ప్రణీత్ రావు ఆరోపణలు వచ్చాయి. కంప్యూటర్ హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో భుజంగరావు, తిరుపతన్న కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ పై బుధవారం వాదనలు ముగిశాయి. నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వు చేసింది.

Tags

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×