Power Demand: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో విద్యుత్ వినియోగం ఆల్ టైం రికార్డుకు చేరుకుంది. శుక్రవారం అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టించింది. శుక్రవారం ఉదయం 11:17 గంటలకు 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ను తట్టుకుని విజయవంతంగా సరఫరా చేసింది. గతేడాది మార్చి 18న నమోదైన రికార్డు 335.19 మిలియన్ యూనిట్లను అధిగమించింది. అదే విధంగా 18,228 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ను కూడా విజయవంతంగా సరఫరా చేసింది. ఉష్ణోగ్రతలు పెరగడం, వ్యవసాయ అవసరాలు అధికమవడం వల్ల విద్యుత్ అవసరం, గరిష్ట లోడ్ రెండూ పెరిగాయి. భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ ఉందని అధికారులు తెలిపారు.
Also Read: BRS Party: అరెరే పెద్ద సమస్యే వచ్చిందే.. పాపం బీఆర్ఎస్.. నైరాశ్యంలో కేడర్!
రాబోయే రోజుల్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు తమ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. రోజుకు 350కు పైగా మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం, సుమారు 19,000 మెగావాట్ల గరిష్ట లోడ్ కు చేరుకున్నా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ అధిక డిమాండ్ సమయంలో నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించినందుకు రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారు.
Also Read: LPG Delivery Scam: వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో మోసం.. నకిలీ మెసేజ్లతో దోపిడీ.. జాగ్రత్త