Telangana Prajavani: తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్ లో ఉన్న లోపాల కారణంగా చిన్నారి సాయి కృపకు ఆధార్ కార్డు జారీకి సంకటంగా మారింది. ఉన్నత చదువులు, హాస్టల్లో అడ్మిషన్ కు, బ్యాంకు సహా ఇతర అవసరాలకు ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో చిన్నారి సాయి కృప భవితవ్యం ఆధార్ కార్డు లేకపోవడంతో ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆ చిన్నారి ఆధార్ కార్డు కోసం శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో జరిగిన సీఎం ప్రజావాణిని ఆశ్రయించింది.
చిన్నారి సాయి కృప పరిస్థితిని అర్థం చేసుకున్న సీఎం ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి చిన్నారి తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్ లో ఉన్న లోపాలను సరిదిద్ది ఆధార్ కార్డు మంజూరుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ ఎంసీ అధికారులను ఆదేశించారు. దీంతో ఎన్నో రోజులుగా ఆధార్ లేక బాధ పడుతున్న తమకు సీఎం ప్రజావాణి ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుందని చిన్నారి కుటుంబ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ షాక్.. 93 శాతం పోలింగ్లో లాజికల్ కుట్ర..?
ఇదిలా ఉంటే హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన 216వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 248 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 79, రెవెన్యూ శాఖకు సంబంధించి 31, ఇందిరమ్మ ఇండ్ల కోసం 78 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 60 దరఖాస్తులు అందాయి. డాక్టర్ జీ. చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు.
Also Read: భార్య ముందే ఎక్స్ గర్ల్ఫ్రెండ్తో మాటలు.. జాకీ భగ్నానీ ఓపెన్ స్టేట్మెంట్పై రకుల్ ఏమందంటే?