E-Paper
Advertisement

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Advertisement

Telangana Weather Alert: తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలకు విరామం లభించనుంది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షంతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 3 శుక్రవారం నుండి ఏప్రిల్ 5 ఆదివారం వరకు వివిధ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం (ఏప్రిల్ 3)న‌ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి మరియు మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. శనివారం (ఏప్రిల్ 4)న‌ వర్షాల ప్రభావం మరింత పెరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలతో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల మరియు జనగామ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఆదివారం (ఏప్రిల్ 5) ఆదివారం నాటికి వర్షాల విస్తృతి మరింత పెరగనుంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని ప్రజలను హెచ్చరించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉన్నందున ఐకేపీ (IKP) కేంద్రాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు. ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను వాడకపోవడం ఉత్తమమని నిపుణులు తెలుపుతున్నారు.

Read Also: వేసవిలో పిల్లల ఇమ్యూనిటీ కోసం ఈ ఆహారాలు తప్పనిసరి.. మీ పిల్లల డైట్‌లో ఉన్నాయా?

Related News

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Big Stories

Advertisement
×