Ration Distribution: స్వేచ్ఛ బ్యూరో: ఈనెల 30 గడువు కంటే ముందే, ఈ నెలకు ఇవ్వాల్సిన బియ్యంలో 85% పైగా పంపిణీ పూర్తి చేసిందని తెలంగాణ పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. మీడియా ప్రకటన విడుదల చేసింది. ఈనెల 21 నాటికే, రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి 5.48 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసిందన్నారు. కేంద్రం మార్చి 2న ఇచ్చిన ఆదేశాల మేరకే వేగంగా రేషన్ ఇస్తున్నారని, ఏప్రిల్, మే, జూన్ 2026 నెలలకు సంబంధించిన రేషన్ పంపిణీని ముందుగానే పూర్తి చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు చెప్పిందని, కొత్తగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో గోదాముల్లో స్థలం ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.
Also Read: Digvesh Vs Bishnoi: దిగ్వేష్ ను ట్రోల్ చేసిన రవి బిష్ణోయ్..ఇక జన్మలో ఓవరాక్షన్ చేయడు
ఈ నెలకు మొత్తం 6,43,303 మెట్రిక్ టన్నుల (ఎంటీ) బియ్యం ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 5,48,140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. నెల ముగియడానికి ఇంకా ఎనిమిది రోజులు ఉండగానే 85 శాతం పంపిణీ పూర్తయిందని, రాష్ట్రం మొత్తం మీద ఇప్పటివరకు 2.62 కోట్ల ట్రాన్సక్షన్స్ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రజలకు రేషన్ అందిందన్నారు. వేగంగా రేషన్ ఇస్తున్నా కూడా ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు, రేషన్ షాపుల వద్ద జరిగే ఆన్లైన్ వివరాలను, వేలిముద్రలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తున్నారన్నారు.
Also Read: కేంద్ర ఎన్నికల సంఘానికి TVK చీఫ్ విజయ్ లేఖ.. అందులో ఏం రాసారంటే?