E-Paper
Advertisement

ఆర్టీసీ సమ్మె విరమణ.. ఉదయం నుంచే రోడ్డెక్కనున్న బస్సులు!

ఆర్టీసీ సమ్మె విరమణ.. ఉదయం నుంచే రోడ్డెక్కనున్న బస్సులు!
Advertisement

TGSRTC strike called off: తెలంగాణలో గత మూడు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల సబ్‌కమిటీతో ఆర్టీసీ జేఏసీ (JAC) నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో, సమ్మెను విరమిస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి.

సమావేశం అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని కార్మిక సంఘాలు సానుకూలంగా స్పందించాయని అభినందించారు. కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, విలీన ప్రక్రియలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను త్వరలోనే తొలగిస్తామని భరోసా ఇచ్చారు. శనివారం ఉదయం నుంచే అన్ని డిపోల పరిధిలో బస్సు సర్వీసులు పునరుద్ధరించబడతాయి.

Advertisement

ఈ చర్చల్లో ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కొత్త వేతన సవరణ (PRC) అమలు, ఇతర పెండింగ్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సమ్మె విరమణతో శనివారం తెల్లవారుజామున మొదటి షిఫ్ట్ నుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్సులు యథావిధిగా రోడ్డెక్కనున్నాయి. గత మూడు రోజులుగా రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రయాణికులకు, ముఖ్యంగా దూరప్రాంత ప్రయాణికులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం.

Read Also: ఆర్టీసీ జేఏసీతో మంత్రుల కమిటీ భేటీ.. 29 డిమాండ్లకు సర్కార్ పచ్చజెండా.. ఆ మూడు డిమాండ్ల‌పై కీల‌క చ‌ర్చ‌

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×