E-Paper
Advertisement

Santosh Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావుకు సిట్ నోటీసులు.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణ!

Santosh Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావుకు సిట్ నోటీసులు.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణ!
Advertisement

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న తాజా పరిణామాల్లో భాగంగా, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావుకు ప్రత్యేక విచారణ బృందం (SIT) నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను CRPC సెక్షన్ 160 కింద జారీ చేసిన అధికారులు, రేపు మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

గత కొంతకాలంగా కొనసాగుతున్న కీలక కేసుల విచారణలో భాగంగా సంతోష్ రావు పాత్రపై ఆరా తీసేందుకు సిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ అగ్రనేతలు, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. వారి నుంచి సేకరించిన సమాచారం, డాక్యుమెంట్ ఆధారంగా సంతోష్ రావును విచారించనున్నట్లు సమాచారం.

Advertisement

ఈ పరిణామాల నేపథ్యంలో సంతోష్ రావు తన కార్యాచరణను ఖరారు చేసుకున్నారు. రేపు ఉదయం ఆయన తొలుత హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం, అక్కడి నుంచే నేరుగా సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద భారీగా కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

సిట్ నోటీసులపై బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ మొదలైంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వరుసగా తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే తాము విచారణ చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. రేపటి విచారణలో సంతోష్ రావు ఇచ్చే సమాధానాలు ఈ కేసులో ఎలాంటి మలుపులు తిప్పుతాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

ALSO READ: Chandrababu Naidu: ఏఐ ద్వారా ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కారం.. ఏపీలో టెక్నాలజీ పాలనపై సీఎం చంద్రబాబు సమీక్ష! 

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×