E-Paper
Advertisement

Telangana Economy: తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలు విడుదల చేసిన ప్రభుత్వం

Telangana Economy: తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలు విడుదల చేసిన ప్రభుత్వం
Advertisement

Telangana Economy: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం రాబోయే రెండు దశాబ్దాలలో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో “తెలంగాణ రైజింగ్ – విజన్ 2047” బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది. ఈ మేరకు సోషియో ఎకానమీ – 2026 సోషియో సర్వేలో బ్రిఫింగ్ చేసింది.​ 2025-2026 ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి 10.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది జాతీయ వృద్ధి రేటు (8.శాతం) కంటే గణనీయంగా ఎక్కువగా స్పష్టం చేశారు. 2025-26 అంచనాల ప్రకారం రాష్ట్ర జీఎస్ డీపీ దాదాపు రూ. 17.82 లక్షల కోట్లుగా నమోదైంది. అంటే రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931 కి చేరింది. జాతీయ సగటు రూ. 2,19,575 తో పోలిస్తే ఇది రెట్టింపు స్థాయిలో ఉండటం విశేషం.

రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీలో..

ఇక రాష్ట్ర అభివృద్ధిని సమతుల్యం చేయడానికి తెలంగాణను మూడు ప్రత్యేక జోన్లుగా విభజించినట్లు పొందుపరిచారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండే ఈ ప్రాంతం లో కేవలం సేవా రంగం నెట్-జీరో మెట్రోపాలిటన్‌గా ఉంటుంది. పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీలో రీజినల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ఈ జోన్ తయారీ రంగానికి కేటాయించనున్నారు. రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీలో వ్యవసాయం, గ్రీన్ ఎకానమీ , అగ్రి-ఆధారిత పరిశ్రమలపై దృష్టి సారిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సేవా రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద భాగస్వామిగా ఉంది. 68.6 శాతం వాటాతో రూ. 11,30,596 కోట్ల ఆదాయాన్ని అందిస్తోంది. ఐటీ ఎగుమతులు 16.6 శాతం వృద్ధితో రూ.3.13 లక్షల కోట్లకు చేరాయి.ఇక పారిశ్రామిక రంగంలో 18.5 శాతం వాటాతో 8.1 శాతం వృద్ధిని సాధించింది. ముఖ్యంగా తయారీ , నిర్మాణ రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Advertisement

Also Read: Historical Movie OTT : సముద్రంలో కుప్పలు తెప్పలుగా తేలియాడే శవాలు… ఒళ్ళు గగుర్పొడిచే వార్ డ్రామా

భారత్ ఫ్యూచర్ సిటీ..

వ్యవసాయ రంగంలో 1.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్‌లో 10.1% (రూ. 26,684 కోట్లు) వ్యవసాయ రంగానికి కేటాయించడం గమనార్హం. మరోవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రధాన్యత ఇస్తన్నట్లు వెల్లడించారు. విద్యను మాస్ యాక్సెస్’ నుండి ‘మాస్ ఎక్సలెన్స్’ దిశగా మార్చనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్య రంగంపై ఖర్చును జీఎస్ డీపీలో 8 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. అంతేగాక ముచర్లలో 30,000 ఎకరాల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అభివృద్ధి చేస్తున్నారు. ఇది నెట్-జీరో స్మార్ట్ సిటీగా, ఏఐ సిటీ, ఎడ్యుకేషన్ హబ్‌గా ఉండబోతోంది. ప్రభుత్వం తీసుకున్న క్యూర్, ప్యూర్, రేర్ ప్లానింగ్‌లో తప్పనిసరిగా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థకు పునాదులు పడతాయని సోషియో ఎకానమీ సర్వేలో వెల్లడించారు.

Advertisement

Also Read: Sabudana health risks: సగ్గుబియ్యం తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యల గురించి మీకు తెలుసా?

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×