E-Paper
Advertisement

Telangana Economy: తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలు విడుదల చేసిన ప్రభుత్వం

Telangana Economy: తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలు విడుదల చేసిన ప్రభుత్వం
Advertisement

Telangana Economy: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం రాబోయే రెండు దశాబ్దాలలో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో “తెలంగాణ రైజింగ్ – విజన్ 2047” బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది. ఈ మేరకు సోషియో ఎకానమీ – 2026 సోషియో సర్వేలో బ్రిఫింగ్ చేసింది.​ 2025-2026 ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి 10.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది జాతీయ వృద్ధి రేటు (8.శాతం) కంటే గణనీయంగా ఎక్కువగా స్పష్టం చేశారు. 2025-26 అంచనాల ప్రకారం రాష్ట్ర జీఎస్ డీపీ దాదాపు రూ. 17.82 లక్షల కోట్లుగా నమోదైంది. అంటే రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931 కి చేరింది. జాతీయ సగటు రూ. 2,19,575 తో పోలిస్తే ఇది రెట్టింపు స్థాయిలో ఉండటం విశేషం.

రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీలో..

ఇక రాష్ట్ర అభివృద్ధిని సమతుల్యం చేయడానికి తెలంగాణను మూడు ప్రత్యేక జోన్లుగా విభజించినట్లు పొందుపరిచారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండే ఈ ప్రాంతం లో కేవలం సేవా రంగం నెట్-జీరో మెట్రోపాలిటన్‌గా ఉంటుంది. పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీలో రీజినల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ఈ జోన్ తయారీ రంగానికి కేటాయించనున్నారు. రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీలో వ్యవసాయం, గ్రీన్ ఎకానమీ , అగ్రి-ఆధారిత పరిశ్రమలపై దృష్టి సారిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సేవా రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద భాగస్వామిగా ఉంది. 68.6 శాతం వాటాతో రూ. 11,30,596 కోట్ల ఆదాయాన్ని అందిస్తోంది. ఐటీ ఎగుమతులు 16.6 శాతం వృద్ధితో రూ.3.13 లక్షల కోట్లకు చేరాయి.ఇక పారిశ్రామిక రంగంలో 18.5 శాతం వాటాతో 8.1 శాతం వృద్ధిని సాధించింది. ముఖ్యంగా తయారీ , నిర్మాణ రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Advertisement

Also Read: Historical Movie OTT : సముద్రంలో కుప్పలు తెప్పలుగా తేలియాడే శవాలు… ఒళ్ళు గగుర్పొడిచే వార్ డ్రామా

భారత్ ఫ్యూచర్ సిటీ..

వ్యవసాయ రంగంలో 1.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్‌లో 10.1% (రూ. 26,684 కోట్లు) వ్యవసాయ రంగానికి కేటాయించడం గమనార్హం. మరోవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రధాన్యత ఇస్తన్నట్లు వెల్లడించారు. విద్యను మాస్ యాక్సెస్’ నుండి ‘మాస్ ఎక్సలెన్స్’ దిశగా మార్చనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్య రంగంపై ఖర్చును జీఎస్ డీపీలో 8 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. అంతేగాక ముచర్లలో 30,000 ఎకరాల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అభివృద్ధి చేస్తున్నారు. ఇది నెట్-జీరో స్మార్ట్ సిటీగా, ఏఐ సిటీ, ఎడ్యుకేషన్ హబ్‌గా ఉండబోతోంది. ప్రభుత్వం తీసుకున్న క్యూర్, ప్యూర్, రేర్ ప్లానింగ్‌లో తప్పనిసరిగా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థకు పునాదులు పడతాయని సోషియో ఎకానమీ సర్వేలో వెల్లడించారు.

Advertisement

Also Read: Sabudana health risks: సగ్గుబియ్యం తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యల గురించి మీకు తెలుసా?

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×