BigTV English

TG Excise Department: మద్యం టెండర్లలో కీలక మార్పు.. లైసెన్స్ మూడేళ్లకు!

TG Excise Department: మద్యం టెండర్లలో కీలక మార్పు.. లైసెన్స్ మూడేళ్లకు!

TG Excise Department: తెలంగాణలో మద్యం టెండర్ల గడువు త్వరలోనే పూర్తికానుండటంతో ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం పనిచేస్తున్న 2,620 మద్యం దుకాణాల లైసెన్సులు ఈ నవంబర్ 30న ముగిసేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో వచ్చే టెర్మ్‌కి సంబంధించిన టెండర్ల ప్రక్రియను ముందుగానే ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రకటన వచ్చేముందే టెండర్లు పూర్తి చేయాలని చూస్తున్నారు.


ఈసారి మద్యం టెండర్ల విధానాల్లో కీలక మార్పులు తీసుకురావాలని ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది. గతంలో లైసెన్స్ గడువు రెండు సంవత్సరాల వరకు ఉండగా, ఇప్పుడు దానిని మూడేళ్లకు పెంచే దిశగా చర్చలు సాగుతున్నాయి. అలాగే టెండర్ల దాఖలుకు అవసరమైన నాన్ రిఫండ్ ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచనున్నారు. లైసెన్స్ గడువు పెరగడం, వ్యాపార స్థిరత పెరగడం వంటి అంశాలతో టెండర్లకు మరింత స్పందన వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వ ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచే అవకాశం ఉన్నందున అధికారులు దీన్ని ఒక కీలక అవకాశంగా చూస్తున్నారు.

గత టెండర్లలో యాన్యువల్ ఫీజుగా ఒక్కో షాప్‌కు నగరాల్లో ₹1.05 కోట్లు, మున్సిపాలిటీల్లో ₹60 నుండి ₹80 లక్షల వరకు వసూలు చేసిన ప్రభుత్వం, ఈసారి ఈ ఫీజుల్లో కూడా మార్పులు చేసే అవకాశముంది. గతంలో మొత్తం టెండర్ల ద్వారా రాష్ట్రానికి రూ.2,460 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు లైసెన్స్ గడువు పెరగడంతో ఆ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, కొన్ని కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మార్పుల వల్ల వ్యాపార వాతావరణం మరింత మెరుగవుతుందన్న అభిప్రాయం ఉంది.


ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల సంఖ్యను కూడా పరిశీలిస్తున్న ఎక్సైజ్ శాఖ, అవసరం ఉన్న ప్రాంతాల్లో కొత్త దుకాణాలకు అనుమతులు ఇవ్వాలని యోచిస్తోంది. ఇటీవల ఏర్పాటు చేసిన కొత్త మున్సిపాలిటీల్లో మద్యం దుకాణాల కోసం ప్రత్యేకంగా పర్మిషన్లు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. దీనితో పాటు వ్యాపార నిబంధనల్లోనూ కొన్ని కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని అధికారులకు స్పష్టంగా ఆదేశించారు. ఈ క్రమంలో వచ్చే నెల ఆరంభంలోనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించి, 15 రోజులపాటు దరఖాస్తులు స్వీకరించి, అనంతరం లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నట్లు సమాచారం. ఈసారి టెండర్ల పట్ల వ్యాపారవర్గాల్లో ఆసక్తి పెరిగే అవకాశం ఉండగా, ప్రభుత్వం మాత్రం ఆదాయాన్ని పెంచే దిశగా ఈ నిర్ణయాలను తీసుకుంటోంది. టెండర్ల గడువు పెంపుతో పాటు కొత్త షాపుల ఏర్పాటు, బ్రాండ్ల అనుమతులు వంటి అంశాలు తెలంగాణలో మద్యం వ్యాపార రంగాన్ని కొత్త దిశగా తీసుకెళ్లే అవకాశం కలిగించాయి.

Related News

Hyderabad Skywalk: హైదరాబాద్‌లో మరో రెండు స్కైవాక్ లు.. ఈ ఏరియాల్లో ప్రజల కష్టాలు తీరినట్లే!

CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్‌అండ్ టీ తప్పుకోలేదు.. ఇది కేసీఆర్ కుట్ర, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Fake doctors: హైదరాబాద్‌లో ఫేక్ డాక్టర్.. ఎలాంటి లైసెన్స్ లేకుండా వైద్యం.. చివరకు?

KTR Elevations: ఇదేం ఎలివేషన్ సామీ? ఓజీ సినిమాపై కేటీఆర్ కి అంత మోజుందా?

Weather News: రాష్ట్రంలో కుండపోత వర్షం.. ఈ ప్రాంతాల్లో రాత్రంతా కొట్టుడే కొట్టుడు, జాగ్రత్తగా ఉండండి

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువవైన గంజాయి పట్టివేత

Kalvakuntla Kavitha: నేను ఫ్రీ బర్డ్.. బీఆర్ఎస్ నేతలు నాతో టచ్‌లో ఉన్నారు.. త్వరలో బాంబు పేల్చనున్న కవిత?

Income Tax Raids: నాలుగో రోజు క్యాప్స్‌ గోల్డ్ కంపెనీలో ఐటీ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Big Stories

×