E-Paper
Advertisement

Tharun chug : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఆ ముగ్గురు సీఎంలపై తరుణ్ చుగ్ సంచలన కామెంట్స్..

Tharun chug : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఆ ముగ్గురు సీఎంలపై తరుణ్ చుగ్ సంచలన కామెంట్స్..
Advertisement

Tharun chug : ఢిల్లీ మద్యం కుంభకోణంపై తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఈడీ ఛార్జ్‌షీట్‌లో కవిత పేరు ఉండటంపై బీజేపీ-బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లిక్కర్ స్కాంలో ఉన్నారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు తరహాలోనే తెలంగాణ, పంజాబ్ లిక్కర్ పాలసీ పైనా విచారణ జరగాలన్నారు.

కేసీఆర్ దోచుకున్న డబ్బు బయటపడకుండా ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చారని ఆరోపించారు. తెలంగాణలో మొదలైన దోపిడీ ఇప్పుడు దేశ రాజధానికి చేరిందని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కేసీఆర్ మౌనం ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. కుటుంబ రాజకీయాలు, అహంకారం, అవినీతి పాలన బీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్య పథకాలని తరుణ్ చుగ్ విమర్శించారు. లిక్కర్ స్కామ్ చార్జిషీట్‌లో కవిత పేరు 48 సార్లు ఈడీ ఎందుకు ప్రస్తావించిందో కేసీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

కవిత ఎందుకు ఫోన్లు మార్చారో ప్రజలకు చెప్పాలని తరుణ్ చుగ్ కోరారు. మాఫియా తరహాలో ఫోన్లను ధ్వంసం చేశారని మండిపడ్డారు. సమీర్ మహేంద్రుతో కవితకు ఉన్న సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. కుటుంబ వాదంతో తెలంగాణను దోపిడీ చేసిన కేసీఆర్.. ఈ ప్రణాళికలో అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌ను కలిశారని తరుణ్ చుగ్ ఆరోపించారు. కుంభకోణంలో ఉన్న వారంతా, కవిత ఇంటికి ఎందుకు వచ్చారని నిలదీశారు. ఒబెరాయ్ హోటల్లో జరిగిన సమావేశం ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. పంజాబ్ రైతులకు చెక్కులు ఇవ్వడం వెనుక కూడా లిక్కర్ కుంభకోణం ఉందని తరుణ్ చుగ్ అన్నారు.

రాజగోపాల్ Vs కవిత..
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కవిత మధ్య ట్విటర్ వార్ నడిచింది. ఢిల్లీ మద్యం కేసులో తాజా ఛార్జ్‌షీట్‌లో కవిత పేరును ఈడీ చేర్చిన నేపథ్యంలో రాజగోపాల్‌ రెడ్డి ఆమెను ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్‌ చేశారు. దీనిపై కవిత గట్టిగా బదులిచ్చారు. రాజగోపాల్ అన్న.. తొందర పడకు.. మాట జారకు. 28 సార్లు తన పేరు చెప్పించినా.. 28 వేల సార్లు చెప్పించినా.. అబద్ధం నిజం కాదు. ట్రూత్‌ విల్‌ ప్రివెయిల్‌ అని కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని.. తన నిబద్ధతను కాలమే నిరూపిస్తుందని వ్యాఖ్యానించారు.

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×